Supreme Court : దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వీఐపీల ప్రవేశం అనే ట్రెండ్ నడుస్తోంది. వీటిని ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు ఈ పిటిషన్కు సంబంధించి ఎటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది.
మారుతీ తన డిసెంబర్ 2024 అమ్మకాల డేటాను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ రికార్డు స్థాయిలో 2,52,693 యూనిట్లను విక్రయించింది. ఈ రికార్డు విక్రయంలో దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాన్ సెగ్మెంట్ అయిన ఈకో కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. వాస్తవానికి.. గత నెలలో ఈకో 11,676 యూనిట్లు విక్రయం జరిగింది. గతేడాది డిసెంబర్లో 10,034 యూనిట్లు అమ్ముడయ్యాయి. విశేషమేమిటంటే..
సిరియాలో తిరుగుబాటు తర్వాత బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం ఇచ్చింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపింది. మాస్కోలో ఉన్నారని రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు. "బ్రేకింగ్! అస్సాద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తన స్నేహితులకు ద్రోహం చేయదు. ఇదే రష్యా- యూఎస్ మధ్య…
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దేశ వృద్ధి రేటుకు సంబంధించి ఆయన తన అంచనాను వెల్లడించారు. ఈ అంచనా ప్రకారం.. FY 25కి దేశ జీడీపీ వృద్ధి తక్కువగానే ఉండవచ్చు. ఈ సమావేశంలో 25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను గవర్నర్ 7.2 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించారు.
దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది.
లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శ్రీనగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీని, బీజేపీని తీవ్రంగా టార్గెట్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కెన్యా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో దేశ అట్టుడికింది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవ్వడంతో పరిస్థితులు చేయిదాటి హింసాత్మకంగా మారింది. పోలీసులకు-నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితులు మొత్తం రణరంగంగా మారాయి
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) మరోసారి QS వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ వర్సిటీ గత 13 ఏళ్లుగా నిరంతరం అగ్రస్థానంలో కొనసాగుతోంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లోని ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం.
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.