గత 2 సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో భయాందోళన సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తి తగ్గడం లేదు. కరోనా కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలు విరుచుకుపడుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో ఇప్పడు మరోసారి ప్రపంచ దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో 6,987 కరోనా కేసులు రాగా, 162 మంది కరోనా సోకి మరణించారు. అయితే ప్రస్తుతం 76,766 కరోనా కేసులు…
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్లో 32,877, కెనడాలో 7,500, యూఎస్లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల…
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6…
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి బెడద 2 సంవత్సరాల నుంచి పోవడం లేదు. కరోనా కట్టడికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని తలచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం టీకాఉత్సవ్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. అయితే తాజాగా తెలంగాణలో 100 శాతం తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 61 శాతం మందికి రెండు…
ఇప్పటికే డెల్టా వేరియంట్ సతమతమవుతున్న భారత్కు ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఇటీవల భారత్లోకి ప్రవేశించిన ఈ వేరియంట్ క్రమక్రమంగా రాష్ట్రాలను ఆక్రమిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 89 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై నిషేధం విధించారు. అలాగే ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్ను…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది. తాజా దేశవ్యాప్తంగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 78,291 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న…
కరోనా రక్కసి మహారాష్ట్రను వదలనంటోంది. డెల్టా వేరియంట్తో ఇప్పటికే మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సైతం మహారాష్ట్రలో విజృంభిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతో 8 మంది పోలీసులతో సహా మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్గా వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత…
దేశంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 6,317 కరోనా కేసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఒక్కరోజులో 318 మంది కరోనా సోకి చనిపోయినట్లు తెలిపారు. వీరితో పాటు 3,900 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 78,190 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీనితో పాటు దేశంలో 138.95 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు…
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్లు బయట పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్తోనే ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టినా మరికొన్ని దేశాల్లోనైతే డెల్టా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా ఎఫెక్ట్తో పలు దేశాలు…