కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది. తాజా దేశవ్యాప్తంగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 78,291 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగిందని అధికారులు వెల్లడించారు. అయితే దేశంలోకి ప్రవేశించిన ఒమిక్రాన్ కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్యం 236 కు చేరుకుంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న వేళ ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్పై ప్రత్యేక దృష్టి సారించాయి.