తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. Read Also: తెలంగాణలో భూములకు కొత్త మార్కెట్…
ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న కొన్ని రాష్ట్రాల్లో జోరుగానే ఉంది. అక్కడక్కడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి కంట్రోల్లో లేదు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మాత్రం కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో సగం కేరళలోనే వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 25,010 కరోనా కేసులు నమోదు కాగా, 177 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2.37 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితుల పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. గతంలో కోర్ట్ ఇచ్చిన ఆదేశాల అమలు, రాష్ట్రంలో ఉన్న కేసులు వివరాలపై ఆరా తీయనుంది హైకోర్టు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ పై నివేధించనున్నాయి వైద్య శాఖ, పోలీస్ శాఖ. ఈనెల 14 న రంజాన్ పండుగ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రీలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ సమర్పించనున్నారు పోలీసులు. మూడు…
ఏపీలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనంతపురం ఆసుపత్రిలో కోవిడ్ మరణాలపై రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి… అలాగే రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఆక్సిజన్ ఇచ్చేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆక్సిజన్ దూర ప్రాంతాల నుంచి కాకుండా రాష్ట్రానికి దగ్గరగా ఉన్న బళ్లారి, తమిళనాడు నుంచి ఇచ్చేలా పరిశీలన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్ స్వయం సమృద్ధికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది. కోవిడ్ కేర్…
ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ… ఇప్పటివరకు 437 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేశాం. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచాలని కేంద్రాన్ని కోరాం. ఏపీకి రెండు ట్యాంకర్లు అందుబాటులోకి రానున్నాయి. క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉంటే కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నాము. శ్రీ సిటీలో క్రయోజనిక్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నట్టు సమాచారం ఉంది. 30,559 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లు కొత్తవి ప్రారంభిస్తున్నాం అని అన్నారు. 7,749…
కో విడ్ నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ… టెస్టింగ్ రిజల్ట్స్ ఏరోజుకారోజు వచ్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని తద్వారా పేషెంట్లకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు.రాబోయే 48 గంటల్లో క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ యాంటీజన్ టెస్ట్ లు చేయాలి. అలాగే ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ ద్వారా అన్ని బ్యాక్లాగ్ శాంపిళ్లనూ క్లియర్ చేయాలి.…
కరోనా వైరస్ మహమ్మారి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కలెక్టర్లు… మీ పరిధిలో ఉన్నవి మీరు చేయండి. లేనివి మా దృష్టికి తెస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. మీ కృషికి మేము అండగా నిలవాలన్నదే మా తాపత్రయం. ప్రైవేట్ హాస్పిటల్ లో చేరుకున్నది కూడా మన ప్రజలే కాబట్టి వారికి ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంటే…