కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. చిన్న పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా తన పంజా విసురుతుంది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బూస్టర్ డోసు కూడా ఇవ్వాలనే నిర్ణయానని తెరపైకి తెచ్చిన విషయం తెల్సిందే. బూస్టర్ డోసు పరిమితిని కూడా తొమ్మిది నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని ఆరోగ్య శాఖ మంత్రి…
ఇండియాలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో 2,38,018 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. నిన్నటి కేసుల కంటే ఈరోజు 20,071 కేసలు తక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,57,421 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 310 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 17,36,628 పాజిటివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో ఇప్పటి…
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు. గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న…
ఒమిక్రాన్ వేరియంట్పై ప్రముఖ వైరాలజిస్ట్ టి జాకబ్ జాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ దారితప్పి పుట్టిన ఓ వేరియంట్ అని అన్నారు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్కు వూహన్లో పుట్టిన డి614 జీ వేరియంట్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒమిక్రాన్కు డి 614 జీ వేరియంట్ ముత్తాత వంటిదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద రెండు రకాల వేరియంట్లు ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి పాత వూహాన్ వేరియంట్ దాని ఉత్పరివర్తనాలు కాగా, రెండోది ఒమిక్రాన్…
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్సైట్లో చూడొచ్చని అధికారులు సూచించారు. Read Also: స్కూళ్ళు, కాలేజీలు సరే.. వాటి సంగతేంటి? మరోవైపు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను…
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నమోదైన కేసుల కంటే సోమవారం రోజున 5 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్సభ సమావేశాలను షిఫ్ట్లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులనే స్కూళ్లలోకి అనుమతిస్తామని హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. ఈ మేరకు 15-18 ఏళ్లలోపు విద్యార్థులు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే స్కూళ్లకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Read Also: పంది గుండెతో మొదటి ప్రయోగం మనవాడిదే… కానీ! కరోనా కారణంగా ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 500లోపు కరోనా కేసులు నమోదు కాగా… ఇప్పుడు ఆ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం…. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది.…
తెలంగాణ రాష్ట్రం పై కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. ఈ రోజు తాజా గా రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్…