తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 16 అభ్యర్థులతో మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. నామినేషన్లు మరో ఐదు రోజుల్లో ముగియనున్నాయి. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్న స్థానాలను ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రకటించింది.
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్పీఎం, కాంగ్రెస్ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది.
ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలకు బీసీలపై ప్రేమ పుట్టుకొచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ కుల గనన వివరాలు బయటపెట్టే బయట పెట్టె దమ్ము ధైర్యం కాంగ్రెస్ బీజేపీ లకు ఉందా అని ఆమె ప్రశ్నించారు.
కాంగ్రెస్- బీఆర్ఎస్ రెండు ఒక్కటే.. నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి అని ప్రమోద్ పాండురంగ సావంత్ అన్నారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి.. కలిసి పని చేశాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సి ఉంది.
సీపీఐ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదిరింది. కొత్తగూడెం సీటు, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మునుగోడులో స్నేహపూర్వక పోటీ కూడా ఉండొద్దని తేల్చి చెప్పింది.
ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు రాజీనామా చేశారు.
Mahadev App case: ఛత్తీస్గఢ్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్కి ఈ కేసు చుట్టుకుంటోంది. ఇటీవల రూ.5 కోట్లతో ఈడీకి పట్టుబడిన కొరియర్, సీఎంకి యాప్ ప్రమోటర్లు రూ. 508 కోట్లు చెల్లించారని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం బీజేపీ కావాలనే ఇలా చేస్తుందంటూ ప్రతివిమర్శలు చేశారు.
Arvind Kejriwal: వచ్చే ఏడాది హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ లో 117 స్థానాలకు గానూ 92 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చినట్లే హర్యానలో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో పర్యటించారు. హర్యానాలోని రోహ్తక్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్డౌన్ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
వేలం పాట మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారన్నారు రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా కే.లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారని, breaking news, latest news, telugu news, brs, bjp, congress, k laxman