Kichannagari Laxma Reddy: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగడుతూ కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన గారి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఇవాళ పాదయాత్ర చేసుకుంటూ ముస్లిం మైనారిటీ సహోదరులు సమస్యలు తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మార్పు చేసి మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Bhatti Vikramarka: సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా భట్టి ప్రచారం
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. సేవకుడిగా ఈ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మవద్దని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. సరికొత్త ప్రణాళికతో పాటు మంచి విజన్ తో కొత్త ఆలోచనతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.