మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీకి రాజీనామా చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు.…
ఫిబ్రవరి 14వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య జన్మదినమని, దామోదర్ సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ గా సంజీవయ్య జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానన్నారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న దామోదర సంజీవయ్య జన్మదిన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు వీహెచ్. 13వ తేదీన రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నారని, ఆందోళన రెండు రోజుల ముందే ఢిల్లీలోకి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు…
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
Money Laundering Case : కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మరోసారి విచారణకు పిలిచింది. నిన్న, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేంద్ర ఏజెన్సీ రాంచీలో 11 గంటల పాటు విచారించింది.
కర్ణాటక (Karnataka)లో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ డీకే.సురేష్ (DK.Suresh) చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాల్చి చంపాలంటూ బీజేపీ నేత ఈశ్వరప్ప (Eswarappa) చేసిన వ్యా్ఖ్యలపై డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ (DK Shivakumar) మండిపడ్డారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్క సుమన్ దగ్గరే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడి చెప్పు చూపించారు. తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు…