Congress: కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. కమల్నాథ్కు ఉపశమనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సెకండ్ లిస్టులో 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. తొలి జాబితాలో తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులనే ప్రకటించింది. ఈసారి మాత్రం రెండు రాష్ట్రాల ప్రస్తావన లేదు.
ఇక మధ్యప్రదేశ్లో కమల్నాథ్కు కంచుకోట అయిన చింద్వారా నుంచి ఆయన కుమారుడు నకుల్నాథ్ పేరును ప్రకటించారు. కమల్నాథ్ కుమారుడికి వేరే స్థానం ప్రకటిస్తారని తొలుత వార్తలు వినిపించాయి. దీంతో సోమవారం కమల్నాథ్ ప్రెస్మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కమల్నాథ్ కుమారుడికి సీటు ప్రకటించడంతో వదంతులకు ఫుల్ స్టాప్ పడింది.
Also Read
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
- Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
మొత్తం ఐదు రాష్ట్రాలకు సంబంధించి 43 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ అభ్యర్థులను వెల్లడించింది. తొలి జాబితాలో 39 మందిని ప్రకటించగా.. సెకండ్ లిస్టులో మాత్రం 43 మందిని ప్రకటించింది. 43 మందిలో జనరల్ కేటగిరీకి చెందినవారు 10 మంది కాగా.. 13 మంది ఓబీసీలు, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఒకరు ముస్లిం మైనారిటీకి చెందినవారని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
అసోంలోని జోర్హాట్ నుంచి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ పోటీ చేయనున్నారు. నకుల్ నాథ్ మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి పోటీ చేయనున్నారు. రాహుల్ కస్వా రాజస్థాన్లోని చురు నుంచి, వైభవ్ గెహ్లాట్ రాజస్థాన్లోని జలోర్ నుంచి పోటీ చేయనున్నారు. మధ్యప్రదేశ్లోని భింద్ నుంచి ఫూల్సింగ్ బరయ్య పోటీ చేయనున్నారు.
ఇక బీజేపీ సెకండ్ లిస్టు కూడా ఈ రాత్రికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం ప్రధాని మోడీ సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది. రెండో జాబితాలో 100 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించే ఛాన్సుంది. ఈ జాబితాలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
#WATCH | Delhi: Congress General Secretary KC Venugopal says "We have already announced our first list of candidates for the Lok Sabha elections. Today, we are going to announce the second list. Yesterday, CEC met and cleared the list of around 43 names from Assam, Madhya… pic.twitter.com/ODKwCE1seF
— ANI (@ANI) March 12, 2024


Congress releases the second list of candidates for the upcoming Lok Sabha elections.
Congress MP Gaurav Gogoi to contest from Jorhat, Assam. Nakul Nath to contest from Madhya Pradesh's Chhindwara. Rahul Kaswa to contest from Rajasthan's Churu and Vaibhav Gehlot to contest from… pic.twitter.com/oms2aliTqF
— ANI (@ANI) March 12, 2024
తాజావార్తలు
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!