అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా…
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు.
PM Modi: లోక్సభలో పవర్ఫుల్ స్పీచ్తో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ముందున్న అతిపెద్ద సవాల్ కాంగ్రెస్తో పాటు దాని ఎకోసిస్టమ్ అని అన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఏఎస్ అధికారులందరూ విధిగా తమ పరిధిలోని శాఖలు, విభాగాలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా పాలనను అందించేందుకు అందరూ బాధ్యతగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందరూ కలిసికట్టుగా పని చేసి ప్రజలకు సుపరిపాలనను అందించి తీరాలని చెప్పారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను…
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో విమర్శలు చేశారు. ఓటముల్లో కాంగ్రెస్ షోలే రికార్డులను కూడా దాటేసిందని అన్నారు. ఈ ఎన్నికల్లో్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా ఓ పాఠం నేర్పిందని చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పవర్ఫుల్ స్పీచ్తో విపక్షాలను ఢిపెన్స్లో పడేశారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన స్కాములు, ఉగ్రవాద దాడులను గుర్తుచేశారు. ఎన్డీయే హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదుల్ని అణిచివేశామని, ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేశాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఆరాధించే వారు, ఓటు బ్యాంకు రాజకీయాలనున ఆయుధంగా మార్చుకున్నారని, అక్కడ ప్రజల హక్కుల్ని అణిచివేశారని అన్నారు. రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లో అమలు కాలేదని అన్నారు. పార్లమెంట్లో…
మంత్రివర్గ విస్తరణపై సందడి కొనసాగుతుండగా, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం ఇక్కడ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. అయితే రానున్న బడ్జెట్ సమావేశాలతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న కొత్త బిల్లులపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం. ఇది కాకుండా, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై కూడా చర్చించినట్లు వర్గాలు తెలిపాయి, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందా లేదా అనేది వెల్లడించలేదు. ముఖ్యమంత్రి…
ఈరోజు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పెట్టుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నూతనంగా ఎన్నికైన నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వారం రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రెండు లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రసారమాధ్యమాలకు విజ్ఞప్తి చేశారు.