Bandru Sobharani: కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘాటు వ్యాఖ్యలు!
- కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు
- పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు
- చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు
- అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారని ఆరోపణ
కేటీఆర్ పై మహిళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ.. “పబ్బులు తిరిగే లోపర్ నా కొడుకు.. చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే విగ్రహాల రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా. తెలంగాణ తల్లి హుందాతనం తీసుకొచ్చి మరింత గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. కొంత మంది మేధావుల పేరుతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ముడుపుల కోసం కొంత మంది మేధావులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు.” అని ఫైర్ అయ్యారు.
READ MORE: Atchutapuram Sez: కెమికల్ ఫ్యాక్టరీలో పేలిన రియాక్టర్.. 18 మందికి పైగా తీవ్రగాయాలు
Also Read
కాగా.. రాష్ట్ర రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార, ప్రతిపక్షాలు ప్రచ్ఛన్న యుద్ధానికి దిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సచివాలయానికి ఓ వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏర్పాట్లు కూడా పూర్తి విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్ గా రాహుల్ గాంధీని ఆహ్వానించింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైరయ్యారు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగిస్తామని, దీంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను కూడా మారుస్తా మన్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!