కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జూలై 8న మణిపూర్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపూర్లో మే, 2023 నుంచి జాతి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ప్రధాని లోక్సభ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలనుకున్నారని, అయితే బీజేపీ సర్వే చేసి పరిస్థితి బాగా లేదని చెప్పడంతో ఆయన పోటీ చేయలేదని శనివారం అన్నారు
Rahul Gandhi: విధి నిర్వహణలో అమరుడైన ‘అగ్నివీరుడు’ అజయ్ కుమార్ ఫ్యామిలీకి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
GHMC Council Meeting: ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది.
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు.
రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంగళవారం పరస్పరం వాదించుకున్న బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు బుధవారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో ఎం.శ్రీనివాస్ తనను అవమానపరిచారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా కౌశిక్ రెడ్డిపై చిగురుమామిడి జెడ్పీటీసీ, జెడ్పీ ఫ్లోర్ లీడర్ గికురు రవీందర్ తనను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు…