వైద్య ఆరోగ్యశాఖలో భారీ రిక్రూట్మెంట్కు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. సిబ్బంది కొరతలేని ప్రభుత్వాసుపత్రి దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటుంది సర్కార్.. అందులో భాగంగా సుమారు 14,200 పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యకళాశాల, బోధనాసుపత్రుల వరకూ వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.. అక్టోబర్ నుంచి ప్రక్రియను ప్రారంభించి.. నవంబర్ 15 నాటికి ముగించాలన్న ప్లాన్కు సీఎం ఆమోదం తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖపై ఇవాళ…
కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు డ్వాక్ర మహిళలకు గుడ్న్యూస్ చెప్పింది వైసీపీ సర్కార్.. అక్టోబర్ 7వ తేదీ నుంచి వరుసగా 10 రోజుల పాటు విజయ దశమి కానుకగా రెండో విడత ఆసరా అందజేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.. స్పందన కార్యక్రమం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అక్టోబర్ 7 నుంచి 10 రోజుల పాటు…
ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…
గ్రామాల్లో 100 శాతం ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గ్రామాల్లో ఇళ్ల పన్నుల వసూళ్లకు ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా తీసుకొచ్చింది. టెక్నాలజీ సాయంతో 100 శాతం ఇంటి పన్నులను వసూళ్లు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.. బోగస్ చలానాలు.. నకిలీ రసీదుల బెడద ఉండదని స్పష్టం చేస్తున్నారు అధికారులు.. పక్కాగా ఇంటి పన్నుల వసూళ్లైతే గ్రామ పంచాయతీలకు నిధులు సమకూరుతాయని అంచనా వేస్తోంది వైసీపీ సర్కార్.. ఇక, ఇంటి పన్నుల వసూళ్లకోసం…
ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎంపీపీ ఎన్నిక 24వ తేదీన జరగనుండగా.. జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు 25వ తేదీన జరగనున్నాయి.. అయితే, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… క్లీన్స్వీప్ చేసింది.. అన్ని జడ్పీ చైర్మన్ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.. ఇదే ఊపులో జడ్పీ ఛైర్మన్ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది.. వైసీపీ…
ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్గా మారిపోయిన ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై…
త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విశాఖలో హాయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు రెండవ సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో 30 మంది విద్యా సంస్థల డైరెక్టర్లు, వీసీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ప్లానింగ్ బోర్డు లేదు… మన రాష్ట్రంలోనే ఉందని గుర్తుచేశారు.. విద్యాశాఖ కిందకు రాని వెటర్నరీ, అగ్రికల్చర్, మెడికల్ యూనివర్సిటీలను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. మౌలిక వసతులు,…
మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు హీట్ పెంచాయి… ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే.. సీఎం వైఎస్ జగన్.. మంత్రులు, డీజీపీ.. ఇలా.. అందరినీ వరుసపెట్టి కామెంట్ల్ చేశారు.. ఆయన వ్యాఖ్యలపై భగ్గుమన్న వైసీపీ శ్రేణులు.. ఇవాళ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ముట్టడికి కూడా వెళ్లారు.. అయితే, తన కామెంట్లపై మరోసారి స్పందించిన అయ్యన్నపాత్రుడు.. నేను మాట్లాడింది చూడండి.. ఎక్కడైనా తప్పు మాట్లాడానా? అని ప్రశ్నిస్తూనే..…
ఆన్లైన్ టిక్కెట్ల అమ్మకంపై ఈ నెల 20న సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిపై చర్చించేందుకు.. సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలను ఆహ్వానించింది. ఆన్లైన్లో టిక్కెట్లు అమ్మే అంశంపై అభిప్రాయాలు, సలహాలు తీసుకోనుంది. ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకం సొమ్మును రియల్ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తామని ఈ సమావేశంలో ప్రభుత్వం స్పష్టం చేయనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు.. సినీ ప్రముఖులు, థియేటర్ ఓనర్లతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని…