Yogi Adityanath: “వాళ్లను మట్టిలో కలిసేస్తాం”.. సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంపై ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ మాఫియాను ప్రోత్సహిస్తోందని సీఎం ఆరోపించారు. వాళ్లందరిని ‘‘ మట్టిలో కలిపేస్తాం’’ అని హెచ్చరించారు. ఉమేష్ పాల్ శుక్రవారం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో బాంబుదాడిలో చంపబడ్డాడు. ఈ దాడిలో అతని గన్ మెన్ కూడా గాయపడ్డాడు, ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించి రాజుపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన గెలిచిన కొన్ని నెలల తర్వాత హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
Read Also: Sonia Gandhi: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది..
ఈ క్రమంలో అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎస్పీ నేరస్తులను ఆదరిస్తోందని, వారికి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారని, ఆపై రాష్ట్రంలో శాంతిభద్రతలపై డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కు మద్దతు ఎస్పీ మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని మాఫియాలను ప్రభుత్వం అంతం చేస్తుందని అన్నారు.
సీఎం యోగి వివర్శలపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. నిన్న బాంబులు పేల్చిన తీరు చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గ్యాంగ్ వార్ లాంటి పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టం అవుతుందని అన్నారు. బాహటంగా తుపాకులు పేల్చేది రామరాజ్యమా..? అని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, బీజేపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!