Yogi Adityanath: “వాళ్లను మట్టిలో కలిసేస్తాం”.. సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంపై ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ మాఫియాను ప్రోత్సహిస్తోందని సీఎం ఆరోపించారు. వాళ్లందరిని ‘‘ మట్టిలో కలిపేస్తాం’’ అని హెచ్చరించారు. ఉమేష్ పాల్ శుక్రవారం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో బాంబుదాడిలో చంపబడ్డాడు. ఈ దాడిలో అతని గన్ మెన్ కూడా గాయపడ్డాడు, ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించి రాజుపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన గెలిచిన కొన్ని నెలల తర్వాత హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: Sonia Gandhi: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది..
ఈ క్రమంలో అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎస్పీ నేరస్తులను ఆదరిస్తోందని, వారికి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారని, ఆపై రాష్ట్రంలో శాంతిభద్రతలపై డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కు మద్దతు ఎస్పీ మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని మాఫియాలను ప్రభుత్వం అంతం చేస్తుందని అన్నారు.
సీఎం యోగి వివర్శలపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. నిన్న బాంబులు పేల్చిన తీరు చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గ్యాంగ్ వార్ లాంటి పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టం అవుతుందని అన్నారు. బాహటంగా తుపాకులు పేల్చేది రామరాజ్యమా..? అని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, బీజేపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!