తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి హరీశ్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
BRS Party: కేంద్ర ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ చెప్పింది.. గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ను కొన్ని గుర్తులు దెబ్బకొట్టాయి.. కారును పోలిన గుర్తులు బ్యాలెట్లో ఉండడంతో.. చెప్పుకోదగిన స్థాయిలో వాటికి ఓట్లు వచ్చాయి.. అదే సమయంలో బీఆర్ఎస్కు తగ్గిపోయాయి.. దాని మూలంగానే కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.. అయితే, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ వచ్చారు ఆ పార్టీ నేతలు.. ఇన్నాళ్లకు వారికి ఈసీ గుడ్న్యూస్ చెప్పింది.. ఎన్నికల్లో…
CM KCR: పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా పంటల సాగులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నామన్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశాం.
Bandi Sanjay Kumar: మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ను నిషేధించబోతున్నారు అని జోస్యం చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కూడా కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి.. తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు అని పేర్కొన్నారు.. తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే.. వందల కోట్ల ప్రజా ధనంతో…