MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్రాన్ని వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని, కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితం అవుతుందని, ఆచరణలో లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దళిత బందు స్కీమ్ ప్రకటనలో ఆర్భాటం చేసిన కేసీఆర్.. స్కీమ్ అమలులో చిత్తశుద్ది ప్రదర్శించ లేదని అన్నారు. బడ్జెట్ లో చేటాయించిన కేటాయింపులు ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 2022 – 23 బడ్జెట్ కేటాయింపులలో దళిత బందు కేటాయింపులు ఖర్చు శూన్యమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఏమైంది? అని ప్రశ్నించారు. 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణమని చెప్పారు.. ఇప్పుడు దాన్ని 3 లక్షలకు తగ్గించి ఇస్తామంటున్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రజలు మార్చి పోతారని అనుకుంటున్నారా? రోజుకు ఒక కొత్త తరహా వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. దళిత బందు లబ్దిదారుల ఎంపిక .. స్వంత స్థలంలో ఇళ్ళ నిర్మాణం కు ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేవని అన్నారు. క్యాబినెట్ సమావేశంలో వీటిపై అసలు చర్చనే లేదని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక యాక్షన్ ప్లాన్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ పై ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 50 వేల కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. గిరిజన బందు అన్నారు .. ఇప్పటి వరకు దాని ఉసే లేదని మండిపడ్డారు. చేసింది చెబితే చాలు అని కేసీఆర్ అంటున్నారు.. ఏం చేశారని చెబుతారు? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లిందని, అందుకే ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి .. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే.. నవవధువు ఆత్మహత్య
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!