MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క యాక్షన్ ప్లాన్ లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి అనేది ఎన్నికల స్టంట్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్రాన్ని వంద సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. రాష్ట్రం వచ్చాక కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందని, కేసీఆర్ చేసే అభివృద్ధి ప్రకటనలకే పరిమితం అవుతుందని, ఆచరణలో లేదని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దళిత బందు స్కీమ్ ప్రకటనలో ఆర్భాటం చేసిన కేసీఆర్.. స్కీమ్ అమలులో చిత్తశుద్ది ప్రదర్శించ లేదని అన్నారు. బడ్జెట్ లో చేటాయించిన కేటాయింపులు ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 2022 – 23 బడ్జెట్ కేటాయింపులలో దళిత బందు కేటాయింపులు ఖర్చు శూన్యమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఏమైంది? అని ప్రశ్నించారు. 5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణమని చెప్పారు.. ఇప్పుడు దాన్ని 3 లక్షలకు తగ్గించి ఇస్తామంటున్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రజలు మార్చి పోతారని అనుకుంటున్నారా? రోజుకు ఒక కొత్త తరహా వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. దళిత బందు లబ్దిదారుల ఎంపిక .. స్వంత స్థలంలో ఇళ్ళ నిర్మాణం కు ఇప్పటి వరకు మార్గదర్శకాలు లేవని అన్నారు. క్యాబినెట్ సమావేశంలో వీటిపై అసలు చర్చనే లేదని మండిపడ్డారు. బీసీల అభివృద్ధికి ఇప్పటివరకు ఒక యాక్షన్ ప్లాన్ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ పై ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 50 వేల కోట్లు క్యారీ ఫార్వర్డ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. గిరిజన బందు అన్నారు .. ఇప్పటి వరకు దాని ఉసే లేదని మండిపడ్డారు. చేసింది చెబితే చాలు అని కేసీఆర్ అంటున్నారు.. ఏం చేశారని చెబుతారు? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కాలం చెల్లిందని, అందుకే ఇప్పుడు మహారాష్ట్ర మీద పడ్డారని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి .. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Malkajgiri Crime: కాళ్ల పారాణి ఆరకముందే.. నవవధువు ఆత్మహత్య
Also Read
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!