CM KCR: రైతులను ఆదుకుంది మనమే.. ఈ విషయాన్ని వారికి చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: పర్యావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా పంటల సాగులో మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్నామన్నారు. దేశంలో ఎవరూ చేయని సాహసం చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను కేంద్రం పట్టించుకోకపోయినప్పటికీ వారిని ఆదుకున్నాం. రెండు, మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. రూ.లక్ష ఇస్తామని చెప్పారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10 వేలు. ఇది చరిత్ర. దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని పని ఇది. ఇందుకు మనం గర్వపడాలి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. వడగళ్ల వాన, అకాల వర్షాల నుంచి రైతులను శాశ్వతంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మార్చి 31లోగా వరి కోతలు పూర్తయ్యేలా పంటలు వేసుకోవాలని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు రైతులకు చెప్పాలని అన్నారు.
మార్చి 31లోపు వరిపంట కోస్తే మిల్లింగ్ సమయంలో నూనె రాదని అన్నారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పంట కాలాన్ని క్రమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలి. పంట సీజన్లో మార్పు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అవసరమైతే ప్రత్యేక జెడ్పీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయన్నారు. ఒక్కో చెరువు కింద 27, 28 గొలుసుకట్టు చెరువులు రైతులకు ఊరటనిచ్చాయి. మిషన్ కాకతీయ లేకుంటే భూగర్భ జలాలు ఎంత వచ్చాయో రైతులకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల బోర్లలో అపరిమిత నీటి లభ్యత ఉందన్నారు. రైతు అనుకూల విధానాల వల్ల పంట దిగుబడిలో పంజాబ్తో సమానం అయ్యాం. యాసంగిలో 56 లక్షల 44 వేల ఎకరాల్లో సాగైంది. రైతుల పట్ల మనకున్న నిబద్ధతను ప్రచారం చేయాలి. అన్నారు.
Heat Wave Alert: ఎండ తీవ్రత, వడగాల్పులు.. అత్యవసరం అయితేనే బయకు రండి..!
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!