తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే…
తెలంగాణలో టీచర్ల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గురువారం రాత్రి తెలంగాణ సర్కారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్లో టెట్ పరీక్ష దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని ఈ నెల 25 నుంచి tstet.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు వైఎస్సీర్టీపీ అధినేత వైఎస్ షర్మిల. యాదాద్రి జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. మోత్కూర్ మాట ముచ్చటలో షర్మిల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 46లక్షల ఇల్లు పేదలకు కట్టించి ఇచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెంచుకుంటూ పోతున్నారు. కేసీఆర్ ఇచ్చేది రెండువేల పెన్షన్ మాటే కానీ దేనికి సరిపోవడంలేదు. నిత్యావసరాల ధరలు భగ్గు మనిపిస్తున్నారు. అప్పు లేని రైతు అప్పులేని కుటుంబం లేదు. తెలంగాణ…
రైతు పడించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే సేకరించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ లోని లక్ష్మీ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి, జెడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ దేశములో పండే ప్రతి వరి గింజను కొనాలని ఉంది. కానీ…
పాలకులు ఏదైనా మంచి పని చేస్తే అది కొన్నేళ్ల పాటు ప్రజలకు గుర్తుండిపోవాలి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన యాదాద్రి ఆలయ పునరుద్ధరణ అలాంటిదే. గుట్టపై నూతనంగా వెలసిన ఆలయ నిర్మాణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ మహాకార్యాన్ని నిజం చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు కూడా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు యాదాద్రి అందాలను చూస్తే మైమరచిపోకుండా ఉండలేరు. అంత రమ్యంగా తీర్చిదిద్దారు యాదగిరి నరసింహుని సన్నిధిని. ఎక్కడా రాజీ…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గత కొద్దికాలంగా మౌనంగా వున్నారు. తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఎక్కడికి పోలేదు. నివురు గప్పిన నిప్పులా కాచుకుని ఉన్నా అన్నారు. గ్రూపు రాజకీయాలు వద్దనే నేను సైలెంట్ గా ఉన్నాను. నా కంటే బెటర్ గా చేస్తారని వెయిట్ చేశాను. గెలుపు కోసం జిల్లాలు మార్చే నేతలు ఉన్నారు. గెలిచినా, ఓడినా నేను ఖమ్మం ఆడ బిడ్డగానే ఉంటానన్నారు. నాకు పదవులు ముఖ్యం…
కేంద్రం ఒకే దేశం ఒకే ప్రొక్యూర్మెంట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర బియ్యపు రాసులతో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ధర్నా నిర్వహిస్తాం. దేశంలోనే అధికంగా పంటలు పండిస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్ కో నీతి హర్యానా కో నీతి తెలంగాణకు ఒక నీతా అని ఆయన మండిపడ్డారు. పంటలను నిల్వ చేసే…
తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రంపై టీఆర్ఎస్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రుల సమావేశం ముగిసింది. అరగంటపాటు సాగింది ఈ సమావేశం. పంజాబ్ నుంచి ఏ తరహాలో అయితే బియ్యాన్ని కేంద్రం సేకరిస్తుందో, తెలంగాణ నుంచి కూడా అదే తరహాలో బియ్యాన్ని సేకరిస్తుంది. ఏ రాష్ట్రం పట్ల కేంద్రం ఎలాంటి వివక్షతతో వ్యవహరించదన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం.…
కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పద్మానాయక ఫంక్షన్ హల్ లో కేంద్రం వడ్లు కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. అనంతరం పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. కేంద్రం ఎఫ్…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి వెళ్లిన కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు.. మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకున్నారు.. ఆ తర్వాత దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన.. అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తిపీఠమైన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మీ అంబాబాయి అమ్మవారిని దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్ దంపతులు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు…