Piyush Goyal Vs Prashant Reddy: హాట్ హాట్గా సాగిన వాదులాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్.
తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే నూక వస్తుంది. ధాన్యాన్నే కొనుగోలు చేయాలి. బియ్యాన్ని సరఫరా చేయలేం…అది సాధ్యం కాదన్నారు ప్రశాంత్ రెడ్డి. వరిధాన్యాన్ని కొనాల్సిందేనని పట్టుబట్టారు మంత్రి. “ఏది అమ్ముడుబోతుందో దాన్నే కొంటాం. తెలంగాణ బియ్యాన్ని ఇస్తే కొనుగోలు చేస్తామే కానీ…..ధాన్యాన్ని మాత్రం కేంద్రం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. రాష్ట్రమే కొనుగోలు చేయాలని సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి గోయల్.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
కేంద్రానికే సాధ్యం కాకపోతే, రాష్ట్రానికి ఆ శక్తి సామర్ధ్యాలుంటాయన్నారు ప్రశాంత్ రెడ్డి. “మీరు ఏదోలా ఈ సమస్య ను పరిష్కరించాలి” అని కోరారు. ప్రశాంత్ రెడ్డి. “కేంద్రం కొనలేదు…తెలంగాణ ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలకు ఈ యాసంగి బియ్యాన్ని తినే విధంగా ప్రోత్సాహించాలి, అలవాటు చేయాలి” అన్నారు గోయల్. “ధాన్య సేకరణ విధానాన్ని మార్చాలని” గట్టిగా డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాన్ని మార్చుకోండి అని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. మీకూ ఒకప్పుడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్నారు. భగవంతుడి దయతలిస్తే, మేము కూడా అధికారంలోకి వస్తాం….అది సాధ్యమే అంటూ తిరిగి బదులిచ్చారు ప్రశాంత్ రెడ్డి.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!