Piyush Goyal Vs Prashant Reddy: హాట్ హాట్గా సాగిన వాదులాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్.
తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే నూక వస్తుంది. ధాన్యాన్నే కొనుగోలు చేయాలి. బియ్యాన్ని సరఫరా చేయలేం…అది సాధ్యం కాదన్నారు ప్రశాంత్ రెడ్డి. వరిధాన్యాన్ని కొనాల్సిందేనని పట్టుబట్టారు మంత్రి. “ఏది అమ్ముడుబోతుందో దాన్నే కొంటాం. తెలంగాణ బియ్యాన్ని ఇస్తే కొనుగోలు చేస్తామే కానీ…..ధాన్యాన్ని మాత్రం కేంద్రం కొనుగోలు చేయడం సాధ్యం కాదు. రాష్ట్రమే కొనుగోలు చేయాలని సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి గోయల్.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
కేంద్రానికే సాధ్యం కాకపోతే, రాష్ట్రానికి ఆ శక్తి సామర్ధ్యాలుంటాయన్నారు ప్రశాంత్ రెడ్డి. “మీరు ఏదోలా ఈ సమస్య ను పరిష్కరించాలి” అని కోరారు. ప్రశాంత్ రెడ్డి. “కేంద్రం కొనలేదు…తెలంగాణ ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలకు ఈ యాసంగి బియ్యాన్ని తినే విధంగా ప్రోత్సాహించాలి, అలవాటు చేయాలి” అన్నారు గోయల్. “ధాన్య సేకరణ విధానాన్ని మార్చాలని” గట్టిగా డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విధానాన్ని మార్చుకోండి అని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. మీకూ ఒకప్పుడు ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్నారు. భగవంతుడి దయతలిస్తే, మేము కూడా అధికారంలోకి వస్తాం….అది సాధ్యమే అంటూ తిరిగి బదులిచ్చారు ప్రశాంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!