BJP MLA Etela Rajender Fired on CM KCR. బీజేపీ ఎమ్మెల్య ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యింది కానీ చేతల్లో చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ అనేక సభలలో రాష్ట్రం అణగారిన వర్గాల వైపు ఉంటుందని చెప్పి, 8 ఏళ్లు అయినా వారి జీవితాల్లో మార్పు రాలేదన్నారు. మద్యం సేవించడంలో తెలంగాణ మొదట స్థానంలో నిలబెట్టారని ఎద్దేవా…
నేతలు హైదరాబాద్ను వదలండి… సొంత ప్రాంతాలకు వెళ్ళండి అంటూ బీజేపీ నేతలతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. హైదరాబాద్ లో ఉండి పార్టీ పని నడిపిస్త అంటే కుదరదని, జిల్లా అధ్యక్షులు జిల్లాల్లోనే ఉండాలి… ఎవరైతే ఉండలేరో రాజీనామా చేయండని ఆయన వెల్లడించారు. పార్టీలో చేరికలు ఉంటాయి.. మేము నలుగురమే ఉంటాము అంటే నడవదన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ని విస్తరించండని, పార్టీ అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆయన వ్యాఖ్యానించారు.…
ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మగ్గిపోతున్న ఉద్యోగులకు తెలంగాణ ఆర్థిక శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్…
Union Minister Kishan Reddy Fired on CM KCR over SC, ST Reservations and Paddy Procurement. కేంద్రమంత్రి కిషన్రెడ్డితో ఎన్టీవీ చిట్చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొండాట ఆడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన కేంద్రం అభ్యంతరం చెప్పదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునఃనిర్మించిన యాదాద్రి శ్రీలక్ష్మినరసింహా స్వామి వారి ఆలయాన్ని వేదపండితులు, అర్చకుల మంత్రోత్చరణల నడుమ ఎంతో వైభవోపేతంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వయంభు లక్ష్మినరసింహా స్వామి వారి ఆలయంలోని గర్భగుడి దర్శనాలు ఆరేళ్ళ తర్వాత పునఃప్రారంభమయ్యాయి. దీంతో స్వామి వారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో…
Congress Senior Leader, MLC Jeevan Reddy Fired on CM KCR. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్పై అగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం కేసీఆర్ గతంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రూ.3 లక్షలు ఇళ్లు కట్టుకునేందుకు ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్సందిస్తూ.. పేదలకు కేసీఆర్ ఇస్తానన్నిది డబుల్ బెడ్రూమ్ ఇళ్లా? లేక సింగిల్…
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం అవుతోంది. యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ లో పాల్గొంటున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళారు కేసీఆర్ దంపతులు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర. ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్…
యాదాద్రి లో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యాదాద్రి లో రేపు జరగనున్న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు దర్శనమివ్వనున్నాడు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధానాలయంలో సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.…
తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ రెడీ అవుతోంది. ‘ప్రజా బ్యాలెట్’ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది బీజేపీ. బషీర్ బాగ్ లో రేపు ‘ప్రజా బ్యాలెట్’ ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాలుసహా ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది బీజేపీ. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. 22 ఏళ్ల కిందట అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని…