Bjp Action Plan: కరెంట్ ఛార్జీల పెంపుపై సమరానికి బీజేపీ రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ రెడీ అవుతోంది. ‘ప్రజా బ్యాలెట్’ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది బీజేపీ. బషీర్ బాగ్ లో రేపు ‘ప్రజా బ్యాలెట్’ ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాలుసహా ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది బీజేపీ. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది.
22 ఏళ్ల కిందట అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునకు పిలుపునివ్వడంతో బషీర్ బాగ్ ప్రాంతానికి వేలాది మంది తరలివచ్చారు. అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు సాక్షిగా మారిన బషీర్ బాగ్ ప్రాంతంలోనే కరెంట్ ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రజాబ్యాలెట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించింది.
Also Read
- Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై 6 వేల కోట్ల భారాన్ని మోపడాన్ని సమర్ధిస్తారా? సమర్ధించరా? అనే అంశాలపై ఇప్పటికే బ్యాలెట్ పత్రం రూపొందించింది టీ బీజేపీ. బషీర్ బాగ్ ప్రాంతంలో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ప్రజలకు బ్యాలెట్ పత్రాలను అందజేసి ప్రజాభిప్రాయాన్ని కోరతామంటున్నారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్, గోల్కొండ గోషామహల్, భాగ్యనగర్ మలక్ పేట్, మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ 8 జిల్లాల అధ్యక్షులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ‘ప్రజా బ్యాలెట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఆ తరువాత వచ్చే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రజాబ్యాలెట్ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బస్టాండ్ , ప్రభత్వ కార్యాలయాలు… ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లో ప్రజా బ్యాలెట్ శిబిరాలను ఏర్పాటుచేయనుంది. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని భావిస్తోంది. దీంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత కరెంట్ ఛార్జీల పెంపుపై భారీ ఎత్తున పోరాటాలకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఛార్జీల పెంపును ఉపసంహరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..
-
Good News : ఇక వాట్సాప్లోనే మార్కుల మెమో.. తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.!
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?