‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, ‘తిమ్మరుసు’ వంటి విభిన్నమైన చిత్రాలతో యంగ్ హీరో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల అద్భుతమైన నటుడు సత్యదేవ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయనను బిగ్ ఆఫర్లు కూడా పలకరిస్తున్నాయి. తాజాగా ఆయనకు ఓ మెగా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో సత్యదేవ్ కూడా నటించబోతున్నాడు. మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న…
“సైరా నరసింహా రెడ్డి” అనే తెలుగు పీరియాడిక్ డ్రామాలో చివరిసారిగా తెరపై కనిపించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. చిరంజీవి చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయ. “ఆచార్య” పూర్తయ్యాక మరో రెండు రీమేక్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరు. మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నాడు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. ఆ తరువాత…
రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేశాడు సంపత్ నంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్, తమన్నా స్టారర్ ‘సిటీమార్’ మీద దృష్టి పెట్టాడు. అయితే, సంపత్ ఫిల్మ్ ఛాంబర్లో ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాకపోతే, మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్ చేస్తోన్న నిర్మాతలకి అదే పెద్ద సమస్యగా మారిందదట. ఎందుకంటే, తమ మెగా రీమేక్ కి ‘గాడ్ ఫాదర్’ అనే టైటిలే దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్టు సమాచారం. కానీ, సంపత్…
సినిమా వాళ్ళకు పండగ సీజన్ అంటే భలే ప్రేమ. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఫెస్టివల్ సీజన్ ను సొమ్ము చేసుకోవడానికి తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో రెండు, మూడు పెద్ద సినిమాలు విడుదలైనా ఇబ్బంది లేదనేది వారు చెప్పే మాట. భోగీ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమా…. ఈ నాలుగైదు రోజులు జనాలకు సినిమా చూసే మూడ్ బాగా ఉంటుందని సినిమా వాళ్ళ నమ్మకం. అలానే దసరా నవరాత్రుల సమయంలోనూ సినిమాలను రిలీజ్ చేస్తే… విజయం…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా “ఆచార్య”. హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సోషల్ మెసేజ్ మూవీ. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ…
కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి చిరు అందించిన ఆపత్కాల సాయం చిత్రసీమలో చర్చనీయాంశం అయ్యింది. దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ ప్రభాకర్ కి చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి అమ్మాయి చదువుకు అవసరమైన ఫీజును వారు అందించారు. ఈ విషయాన్ని గురించి స్వయంగా ప్రభాకర్ తెలియచేశారు. ”నేను దాసరి గారి వద్ద ఎన్నో సంవత్సరాలు కో-డైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన…
టోక్యో ఒలింపిక్స్ 2021లో హైదరాబాద్కు చెందిన భారతీయ షట్లర్ పివి సింధు కాంస్య పతకం సాధించింది. ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోను 2 వరుస సెట్లలో ఓడించింది. సింధు ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండవ భారతీయ అథ్లెట్. ఈ మ్యాచ్లో విజయంతో ఆమె అరుదైన ఘనతను సాధించింది. కాంస్య మ్యాచ్లో సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. “సింధు అద్భుతమైన విజయంతో మేమంతా ఉల్లాసంగా ఉన్నాము. టోక్యో 2020లో…
(ఆగస్టు 1న ‘రాణికాసుల రంగమ్మ’)చిరంజీవి ‘మెగాస్టార్’ కాకముందు శ్రీదేవితో కలసి రెండు సినిమాల్లో చిందేశారు. అందులో ఒకటి శోభన్ బాబు హీరోగా రూపొందిన ‘మోసగాడు’. అందులో చిరంజీవి విలన్ గా నటించారు. ఆ సినిమాలో శ్రీదేవితో కలసి చిరంజీవి వేసిన చిందు అలరించింది. ఆ తరువాత కూడా చిరంజీవిని కాసింత నెగటివ్ షేడ్స్ లో చిత్రీకరించి, ఆయనకు జోడీగా శ్రీదేవితో రూపొందిన చిత్రం ‘రాణికాసుల రంగమ్మ’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాశరావు నిర్మాతకాగా, ఆయన…
మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే “ఆచార్య” విడుదల కానుంది. ఆ తరువాత చిరంజీవి ప్రధాన పాత్రలో మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” రీమేక్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టు 13న హైదరాబాద్లో ప్రారంభం కానుంది. దర్శకుడు మోహన్ రాజా సినిమా షూటింగ్ ను పలు షెడ్యూల్లలో త్వరగా పూర్తి…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేశారు స్టార్ డైరెక్టర్స్ అంతా కలిసి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దానికి ఓ వేడుక కారణమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలు వంశీ తన స్నేహితులు, చిత్ర పరిశ్రమకు…