Child Trafficking : పసికందుల దందాలో పేరున్న హాస్పిటల్స్.. షాకింగ్ రిపోర్ట్.!
- సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్లో షాకింగ్ నిజాలు
- ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్లపై అనుమానాలు
- ఐవీఎఫ్, సరోగసీ పేరుతో పసికందుల విక్రయం
- అంతర్రాష్ట్ర ముఠాలపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత విస్మయకరమైన విషయం ఏమిటంటే, ఈ అక్రమ రవాణా వెనుక హైదరాబాద్లోని దాదాపు 9 ప్రముఖ ఫెర్టిలిటీ సెంటర్ల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోవా IVF, అను ఫెర్టిలిటీ సెంటర్, అంకుర హాస్పిటల్, అక్షయ, హెగ్డే, ఒయాసిస్, పద్మజ , ఫెర్టి-9 వంటి ఆసుపత్రులతో ఈ ముఠా నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Sumathi Sathakam Teaser: నవ్వి.. నవ్వి.. పోతే ఎవరదండి బాధ్యత.. “సుమతీ శతకం” టీజర్ లాంచ్..!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఈ భారీ నెట్వర్క్లో నిందితులు ఐవీఎఫ్ (IVF) , సరోగసీ పేరుతో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. గుడెప్పు సుజాత, సూరబోయిన అనురాధ, పోతుల శోభ వంటి మహిళా ఏజెంట్ల ద్వారా సరోగేట్ మదర్స్ , ఎగ్ డోనర్లను సరఫరా చేస్తూ, చిన్నారుల విక్రయాలను సాగిస్తున్నారు. హైదరాబాద్ , భువనగిరి పరిధిలో ఇప్పటివరకు సుమారు 15 మంది పసికందులను విక్రయించినట్లు తెలుస్తోంది. ఒక్కో పసికందును సుమారు 4 నుంచి 5 లక్షల రూపాయలకు విక్రయిస్తూ ఈ ముఠా సొమ్ము చేసుకుంటోంది. ఈ ముఠాలోని కీలక నిందితులపై ఇప్పటికే 18 క్రిమినల్ కేసులు నమోదై ఉండటం, గతంలో సంచలనం సృష్టించిన ‘సృష్టి’ కేసులో కూడా వీరు నిందితులుగా ఉండటం ఈ ముఠా ఎంతటి ప్రమాదకరమైనదో అర్థం చేస్తోంది. ముంబై , అహ్మదాబాద్లలో కూడా వీరిపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసులు ఉన్నాయి.
ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు పలువురు నిందితులను గుర్తించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకిపల్లి గంగాధర్ రెడ్డి ఈ ముఠాలో కీలక పాత్ర పోషించగా, నోవా , పద్మజ హాస్పిటల్స్కు ఐవీఎఫ్ ఏజెంట్గా పనిచేస్తున్న వేముల బాబు రెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. వీరితో పాటు హర్ష రాయ్, సంగీత దేబి, రామ్ హరి రాయ్, దారం లక్ష్మి వంటి వారు అరెస్టయ్యారు. అయితే బాబా భాస్కర్, గుజరాత్కు చెందిన యూనిస్, శ్రీదేవి, బాబు రావు వంటి మరికొందరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా పసికందుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠా వెనుక ఉన్న ఆసుపత్రి యాజమాన్యాల పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
CM Chandrababu: మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!
తాజావార్తలు
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
-
Trump: వచ్చే వారం ఇంకా దారుణంగా ఉంటుంది.. ఇరాన్పై కొత్త ప్రయోగానికి ట్రంప్ ప్రణాళిక!
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!