Mother Sells Own Son: సొంత కొడుకునే అమ్మేసిన కసాయి తల్లి.. తండ్రి ఆవేదన..!
- నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో కలకలం రేపిన బాలుడు విక్రయ ఘటన
- కన్న బిడ్డను డబ్బు కోసం అమ్మేసిన తల్లి
- ఈ నెల 5వ తేదీన బాలుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి
- మహారాష్ట్ర పూణెలో బాలుడిని రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు పోలీసుల గుర్తింపు
- ఎల్లమ్మ గుట్టకు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mother Sells Own Son: నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న బాలుడు విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్న బిడ్డను స్వార్థం కోసం అమ్మేసిన తల్లి చర్య స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన ఆ బాలుడి తల్లి తన కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణెకు చేరుకుని అక్కడ బాలుడిని రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో ఎల్లమ్మ గుట్టకు చెందిన ఇద్దరి మధ్య వర్తిత్వం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్… విశాఖలో మంత్రి లోకేష్ కీలక పర్యటన
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
బాలుడు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. వాటి ఆధారంగా బాలుడి తల్లి సహా మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన కన్న బిడ్డనే అమ్మేసిన తల్లి చర్యను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం బాలుడిని రక్షించి, భద్రతకు సంబంధించిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
YS Jagan: భవానీపురం జోజీ నగర్ బాధితులకు పరామర్శ.. నేడు విజయవాడకు మాజీ సీఎం వైఎస్ జగన్..!
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!