IPL 2025: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్లో తన సొంత గూటికి చేందుకు సిద్దమైనట్లు సమాచారం. అతన్ని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
CSK- IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రిటెన్షన్ అనుకున్నట్లుగానే కొనసాగింది. ‘కెప్టెన్ కూల్’ఎంఎస్ ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గానే సీఎస్కే తీసుకుంది. కేవలం 4 కోట్ల రూపాయలకే ధోనీకి చెల్లించనుంది.
గోవాలో జరిగిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం జరిగిన చివరి ఐపిఎల్ 2024 లీగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై 27 పరుగుల తేడాతో విజయం సాధించి చివరి ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా వారి అద్భుతమైన ఆటను కొనసాగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరవ వరుస విజయం సిఎస్కెను ఏడు వికెట్లకు 191 పరుగులకే పరిమితం చేయడానికి ముందు బ్యాటింగ్ కు దిగిన తరువాత 218/5 పరుగులు చేసింది. ఈ విజయం 16 సీజన్లలో…
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నైతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది బెంగళూరు. చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే 219 పరుగుల టార్గెట్ ను చేధించాలి. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు.…
ఐపీఎల్ 2024లో భాగంగా.. లీగ్ దశలో చివరి మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన సీఎస్కే.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
బెంగళూరులో గత రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతుంది. కాగా.. ఈరోజే వర్షం తగ్గుముఖం పట్టింది. అయితే.. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ జరుగుతుందా అన్న సస్పెన్స్ కు తెరదించింది. ఆర్సీబీ, సీఎస్కే అభిమానులకు కర్ణాటక వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. కాసేపట్లో జరగనున్న నాకౌట్ మ్యాచ్ కు వర్షం ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచనలు లేవు.. రాత్రి వరకు అనుకూల పరిస్థితులే ఉన్నాయని ట్వీట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు.. అటు ఆర్సీబీ అభిమానులు,…
ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే అనుమానాలొచ్చేలా కింగ్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీతో ఈరోజు మ్యాచ్ ఆడుతున్నానని.. నాకు తెలిసి మేం కలిసి ఆడటం ఇదే చివరిదేమో అని కోహ్లీ తెలిపారు. వచ్చే సీజన్ లో ధోనీ ఆడుతాడో, ఆడడో.. ఎవరికి తెలుసని పేర్కొన్నారు. అయితే.. ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు పండగేనని, అద్భుతమైన అనుభూతి ఇస్తుందని చెప్పారు. మేమిద్దరం కలిసి భారత్ తరఫున చాలా సంవత్సరాలు ఆడామని.. జట్టును ఎన్నోసార్లు…
ఐపీఎల్ 17వ సీజన్లో ఈరోజు కీలక పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. గత సీజన్లో మే 18న జరిగిన మ్యాచ్ ల్లో ప్రతిసారి గెలుస్తూ వస్తోంది. 2013లో సీఎస్కే, 2014లో సీఎస్కే, 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2023లో సన్ రైజర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఈరోజు జరిగే మ్యాచ్లోనూ ఇదే కొనసాగుతుందని, సీఎస్కేపై…