MS Dhoni: ఇట్స్ అఫీషియల్.. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోని
- ఐపీఎల్ 2025 నుండి రుతురాజ్ గైక్వాడ్ అవుట్.
- మోచేయి ఫ్రాక్చర్ కారణంగా టోర్నీ నుండి అవుట్.
- గైక్వాడ్ గాయపడటంతో అతని స్థానంలో ధోనిని మళ్లీ కెప్టెన్
- అఫీషియల్ గా తెలిపిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారి జట్టుకు నాయకత్వం బాధ్యతను మరోమారు ఎంఎస్ ధోనికి కట్టబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ కెప్టెన్గా నియమించినట్లు సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్తో ఇబ్బందిపడుతున్నాడు. మొదట్లో చిన్న గాయం అనుకున్నా.. కానీ, పరీక్షల తర్వాత పూర్తిగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ టాస్కు వచ్చి మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆడే సమయంలో అతడి గాయ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
🚨 OFFICIAL STATEMENT 🚨
Also Read
Ruturaj Gaikwad ruled out of the season due to a hairline fracture of the elbow.
MS DHONI TO LEAD. 🦁
GET WELL SOON, RUTU ! ✨ 💛#WhistlePodu #Yellove🦁💛 pic.twitter.com/U0NsVhKlny
— Chennai Super Kings (@ChennaiIPL) April 10, 2025
కేకేఆర్తో మ్యాచ్కు ముందు, సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. గైక్వాడ్ గాయపడటంతో అతని స్థానంలో ధోనిని మళ్లీ కెప్టెన్గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో ఐపీఎల్ 2025లో మళ్లీ ధోని సీఎస్కేకు నాయకత్వం వహించనున్నాడు. ఇక ఎంఎస్ ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023లో అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే విజయం సాధించింది. ఆ మ్యాచ్ ధోని కెప్టెన్గా చివరి మ్యాచ్గా జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ఎంఎస్ ధోని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్
-
S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్లో స్పెషల్గా కీర్తన..
-
LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం