వైసీపీ ఎమ్మెల్యేలకు పని పాటా లేకుండా ప్రతిపక్షాల మీద పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ. ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టించాలో ఆలోచించడమే పనిగా పెట్టుకున్నారు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా ఈ అభివృద్ధి పని చేశానని కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉందా…? వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను రోడ్డుకీడ్చిందన్నారు అఖిల ప్రియ.
ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు వేయించుకుని చుక్కలు చూపిస్తుంది. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో బాగా చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రావడానికి బాగా ఓట్లు వేసిన ఉద్యోగులను పి ఆర్సీ కోసం చుట్టూ తిరిగేలా చేసింది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేసి రైతులను ఇబ్బంది పెట్టిందన్నారు. పోలీసులు ఏకపక్షంగా చేయకుంటే బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచులు..ఇలా అన్నీ గెలిచినా అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి అవే ఉద్యోగాలు అంటున్నారని తీవ్రంగా విమర్శించారు.