తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, లోకేష్ కు లేదన్న ఆమె.. ఎన్టీఆర్ కుమార్తెగా నారా భువనేశ్వరి అంటే మాకు గౌరవం ఉంది.. ఆమెను కించపరిచే వ్యాఖ్యలు వైసీపీ నేతలు ఎవరూ చేయలేదన్నారు
అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.
మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్... తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు .
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు మంత్రి అమర్నాథ్.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు.
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది.. ఇప్పుడు పవన్…