టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభమైంది.. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై దాడికి నిరసనగా.. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో దీక్షకు దిగారు చంద్రబాబు.. 36 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది.. ఇక, దాడిపై నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ చీఫ్.. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్యలోనే వేదికను ఏర్పాటు చేశారు. వేదికపై ఏపీ టీడీపీ అధ్యక్శుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు.. పార్టీ సీనియర్…
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా.. కాసేపట్లో దీక్షకు కూర్చోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న దీక్ష.. రేపు రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది… టీడీపీ కార్యాలయంలోనే 36 గంటల పాటు దీక్ష కొనసాగించనున్నారు పార్టీ అధినేత.. మరోవైపు.. చంద్రబాబు దీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు తమ్ముళ్లు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల దాడిలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన…
అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల నిరసనలతో ఏపీ హీటెక్కింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పట్టాభి, నారా లోకేష్, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి ఇంచార్జ్ అనం రెడ్డి అజయ్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ చంద్రబాబునాయుడే కారణమని, రాష్ట్రంలో మేమున్నామని,రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి దాడుల డ్రామా ఆడుతున్నారని అజయ్ అన్నారు. బుధవారం సాయంత్రం పెందుర్తి కూడలి లో వైసీపీ శ్రేణులు…
టీడీపీ నేతలు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు పాల్గొన్నారు. వైసీపీ కార్యకర్తలు పంజా సెంటర్ లో చంద్రబాబు ఫోటోను చెప్పలతో కొడుతూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఈ సందర్భందా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గులేదా అని అన్నారు. చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి…
ఏపీలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు చంద్రబాబు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు టీడీపీ నేతలు వైసీపీ సర్కార్ తీరుపై దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలు సీఎం గురించి ఎవరూ అనుచితంగా మాట్లాడినా సహించేది లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్.. ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడినని, నీ వికృత, క్రూర…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని రెండున్నర ఏళ్లుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… చంద్రబాబు నాయుడు మనుషులు ఈ రోజు రెచ్చగొట్టే తీరులో మాట్లాడారని మండిపడ్డారు.. నిన్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో లేవన్నారు. ఇక, చంద్రబాబుకి ఇంట్లో సమస్యలు ఎక్కువయ్యాయని కామెంట్ చేవారు అవంతి. ఆ…
టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో.. జగన్ మోహన్…
ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు…
ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని లేఖలో కోరారు చంద్రబాబు. బీసీలకు సంబంధించిన సరైన డేటా లేకపోవడంతో ఆ వర్గాలకు అన్యాయం జరుగుతోందని… ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా బీసీలు అన్ని రకాలుగా వెనకబడే ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. బీసీ జన గణన పక్కాగా జరిగితేనే బీసీలకు సంక్షేమ ఫలాలు అందుతాయని.. బీసీ జన గణన చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలోనే అసెంబ్లీలో…
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరికీ తెల్సిందే. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇక్కడ టీడీపీ హవానే కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కుప్పంలో పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. కుప్పంలో వైసీపీ క్రమంగా బలపడుతుండగా టీడీపీ బలహీనమవుతోంది.…