Vijayasai Reddy: చంద్రబాబూ.. ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Tweet on Chandrababu Comments: ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. ఏం పీకావంటూ చంద్రబాబుని నిలదీశారు. చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావంటూ ఎద్దేవా చేశారు. కుల పిచ్చితో మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని, ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవని ఘాటుగా స్పందించారు. అంతకుముందు కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు క్షుద్ర విద్యలు నేర్చిన నాగుపాము అని.. భూముల్ని కబళించే టీడీపీ కాలనాగుల్ని ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఇప్పుడు బుసలు కొడుతూ విషం చిమ్ముతోందని విమర్శించారు. పందులు అశుద్ధం తిన్నట్లు.. ప్రభుత్వ భూముల్ని కాజేయడమే చంద్రబాబు, లోకేష్తో పాటు ఇతర టీడీపీ నేతల పని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుక్క నుంచి ముక్క లాగేస్తే ఎలా అరుస్తుందో.. టీడీపీ నేతలు అలాగే అరిచినట్లే మొరుగుతున్నారని ధ్వజమెత్తారు.
అలాగే.. ఉత్తరాంధ్రకు చంద్రబాబు వచ్చిన సమయంలోనూ ఆయనపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఏం పని అని, వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదే ఉంటాయని ఆరోపించారు. పేదలు వలసపోతుంటే ఆనందించారని, పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజం పడిందని.. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసని చెప్పారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ క్షణమైనా జగన్, విజయసాయి రెడ్డి అరెస్ట్ కావొచ్చని బొండా ఉమా మహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బెజవాడ ప్రజలు బండికేసి బాదినా తీరు మారలేదని, దున్నపోతులాంటి కొడుకుని రోడ్డు మీదకి వదిలి పాదచారుల ప్రాణాలు తీసినప్పుడు పోలీసులు బూట్లు నాకిన రోజుల్ని మర్చిపోయారా? అని నిలదీశారు.
Also Read
- Gadikota Srikanth Reddy: 'ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు'.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏమి పీకావ్ చంద్రం? చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని 3 దశాబ్దాలు సర్వనాశనం చేశావు. ఈ జన్మకి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 17, 2022
తాజావార్తలు
-
Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
-
Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
-
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
-
Honor Pad X9 Max: హానర్ ప్యాడ్ X9 మ్యాక్స్ విడుదల.. 10,100 mAh బ్యాటరీ, 13- ఇంచెస్ 2.5K డిస్ప్లే
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!