ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలు రానేవచ్చాయి. తెలంగాణ, ఏపీతో పాటు 10 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తుండటంతో అక్కడక్కడ పోలింగ్ ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదర్కొన్నారు. వర్షాల వల్ల నిన్న, మొన్న చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని సీఈఓ వికాస్ రాజ్…
మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని…
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరిగే ఓటింగ్ రోజున తమ ఓటు వేసే బాధ్యతను మరచిపోవద్దని రాష్ట్ర ఎన్నికల సిఇఓ వికాస్ రాజ్ అన్నారు. శనివారం ఎస్ఆర్ నగర్ లో సిఇఓ ఇంటి వద్దకు వెళ్లి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్, పోలింగ్ తేదీతో పాటు ఓటరుగా గర్వ పడుతున్నాను అనే స్టిక్కర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వికాస్ రాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా సిఇఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ……
Lok Sabha Elections: తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు ఈసీ శుభవార్త చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని సీఈసీ వికాస్ రాజ్ తెలిపారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఎంపీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.. నామినేషన్లు ఆన్లైన్ లో కూడా సమర్పించవచ్చు.. నామినేషన్ పత్రాలు ప్రింట్ తీసి 24 ఏప్రిల్ వరకు ఆర్వోకు అందజేయాలన్నారు.
భద్రాచల శ్రీరామ కల్యాణం ప్రత్యక్ష ప్రసారం అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో స్క్రీనింగ్ కమిటీ ఉంది.. ఈ కమిటీ నిర్ణయం ఎలా ఉంటే అదే ఈసీఐకి నివేదించాము.. ఈసీఐ నుంచి కూడా స్పష్టత రావాల్సి ఉంది అని వికాస్ రాజ్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుషులు 1,64,47,132, మహిళలు 1,65,87,244, థర్డ్ జెండర్ 2,737 మంది ఉన్నారు. 15,378 సర్వీస్ ఓటర్లు, 3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో…
తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పలు కంప్లైంట్స్ వచ్చాయని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. డీఈఓ రిపోర్ట్ రాగానే కోడ్ ఉల్లంఘిస్తే ఎఫ్ఐఆర్ రిజిష్టర్ చేస్తారు.