Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ…
సినీ నటి రన్యా రావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగారం స్మగ్లింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది.. బంగారం స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఏకీ రన్యారావ్ దొరికి పోయిన విషయం తెలిసిందే.. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కిలోల బంగారాన్ని తీసుకువస్తూ దొరికింది. ఇప్పటికే రన్యారావ్ ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. కోర్టు అనుమతితో రన్యా రావును మూడు రోజుల కస్టడికి తీసుకొని విచారిస్తున్నారు.. విచారణలో పలు కీలక విషయాలు చెప్పింది.