Supreme Court: “హైకోర్టు తప్పు చేసింది”.. యాక్టర్ దర్శన్ బెయిల్పై సుప్రీంకోర్టు..
- యాక్టర్ దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
- గతేడాది రేణుకాస్వామి హత్య కేసుపై విచారణ..
- బెయిల్ ఇచ్చినందుకు కర్ణాటక హైకోర్టుపై ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: గతేడాది తన అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కీలక నిందితుడిగా కన్నడ స్టార్ హీరో దర్శన్ ఉన్నాడు. దర్శన్తో పాటు అతడి భాగస్వామి పవిత్ర గౌడ కూడా నిందితురాలు. రేణుకాస్వామిని కర్ణాటకలో చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి, దారుణంగా చిత్ర హింసలు పెట్టి హత్య చేశారు. అయితే, కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.
కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘ప్రాథమిక దృష్టితో కూడిన న్యాయ అధికారాన్ని దుర్వినియోగం చేయడం’’ అని విమర్శించింది. దర్శన్ తూగదీపకు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టును సుప్రీంకోర్టు మందలించింది. బెయిల్ మంజూరు చేయడంలో విచక్షణ ఉపయోగించడంలో విఫలమైందని గత వారం హైకోర్టుకు చెప్పింది.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
Read Also: HHVM : హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
గురువారం మధ్యాహ్నం జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు చేసిన తప్పును తాము చేయబోమని చెప్పింది. హత్య కుట్ర కేసు కాబట్టి మేము దీనిపై కొంచెం తీవ్రంగా ఉన్నామని చెప్పింది. హైకోర్టు డిసెంబర్ 2024 బెయిల్ ఆర్డర్లోని భాషపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడలతో సహా మొత్తం 13 మంది నిందితులు ఉన్నారు. దర్శన్ స్నేహితురాలు పవిత్రగౌడకకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడనే ఆరోపణలతో రేణుకాస్వామి హత్య జరిగింది. రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న మురుగునీటి కాలువలో కనుగొన్నారు. రేణుకాస్వామి కిడ్నాప్లో పాల్గొన్న నలుగురికి దర్శన్ రూ. 50 లక్షలు ఇచ్చాడని పోలీసులు భావిస్తున్నారు. అపహరణ, హత్యకు సంబంధించిన అన్ని అంశాలను నిర్వహించడానికి, అలాగే మృతదేహాన్ని పారవేయడానికి ప్రదోష్ (అలియాస్ పవన్) అనే వ్యక్తికి రూ. 30 లక్షలు ఇందులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్య , మృతదేహాన్ని పడవేయడంలో సాయం చేసిన నిఖిల్, కేశవమూర్తికి రూ. 5 లక్షలు చొప్పున ఇచ్చారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!