ఏపీలో రేపటి నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కులగణన స్టార్ట్ చేయనున్నారు. 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొదలు కానుంది.
ఈ నెల 21 నుంచి కుల గణన ప్రారంభం అవుతుంది అని సమాచార శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుంది.. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అన్నారు.
రాష్ట్రంలోని బీసీ మనసుల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అంటూ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాష్ట్రాలు కుల గణన చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.. అందులో భాగంగానే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం అని ఆయన పేర్కొన్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 21న మంత్రాలయంలో నిర్వహించే సభకు రావాలని ఆహ్పానించామన్నారు.
ప్రధాని మోడీ గతంలో పార్టీ నేతల మాదిరిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లెక్కలు బయటపెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఈ రోజు రాహుల్ గాంధీ దీని గురించి గళం విప్పారు.
PM Modi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులగణన చేపట్టింది. దానికి సంబంధించిన వివరాలను ఈ రోజు ప్రకటించింది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ ఎన్నికల్ ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు కులం పేరుతో దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం ధ్వజమెత్తారు.
Rahul Gandhi: దేశంలో తొలిసారిగా బీహార్ రాష్ట్రం కులాల వారీగా సర్వే చేసింది. కుల గణన ఫలితాలను ఈ రోజు వెల్లడించింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం చేసిన ఈ పనిని కాంగ్రెస్ స్వాగతించింది. సామాజిక న్యాయం చేయడానికి, సామాజిక సాధికారత కోసం జాతీయ స్థాయిలో ఇలాంటి కసరత్తు చేయాలని కేంద్రాన్ని కోరింది.
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. శనివారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో పాల్గొన్నారు.
Nithish Kumar : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పాట్నా హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో తన ఆధ్వర్యంలో చేపడుతున్న కుల గణనను హైకోర్టు నిలిపేసింది. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకునే ఉద్దేశంతో నితీష్ కుమార్ కుల ఆధారిత సర్వే నిర్వహిస్తున్నారు.
దేశంలో 2021 జనాభా లెక్కలను త్వరగా నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధానిని డిమాండ్ చేశారు. జనాభా గణనలో కులాన్ని అంతర్భాగంగా చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.