రాష్ట్ర వ్యాప్తంగా 16 వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా.. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చెయ్యాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు అంటూ ఎక్స్లో హరీశ్ రావు విమర్శలు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆయన ఏదో చేయబోతే… అది ఇంకేదో అయిపోయి ఇరుకున పడేసిందా? కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా బుక్కయిపోయారా? ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడాయన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నాయా? ఇంతకీ… ఏ విషయంలో ఇరుక్కుపోయారు కేటీఆర్? కాంగ్రెస్ పార్టీ ఎలా సోషల్ రివెంజ్ తీసుకుంటోంది? ఈ రైతు ఆవేదన వీడియోని ఎక్స్లో పోస్ట్ చేసిన కేటీఆర్… రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడమంటూ జనం మీదికి వదిలారు.…
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్కు చెందిన ఫామ్ హౌస్లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప…
KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్…
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
సెక్రటేరియట్లో సీఎస్ శాంతికుమారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సమావేశం అయ్యారు. అనంతరం సీఎస్కు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరోసారి బీజేపీని గెలిపించిన…
గులాబీ బాస్ కేసీఆర్... ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చేశారు. నేనేదో..... ఫామ్హౌస్లో కామ్గా ఉన్నానని అనుకుంటున్నారేమో... కో....డ్తే...... మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారాయన.