Telangana Assembly : తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిపై అసెంబ్లీలో వేడివేడి చర్చ
- ఫార్మా సిటీకి ప్రతిపక్షాల అడ్డంకులు – మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు
- బీఆర్ఎస్ భూసేకరణ విధానం పై మంత్రి కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిపై అసెంబ్లీలో వేడివేడి చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో తపమంటున్నాయని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఆ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. ఫార్మా పరిశ్రమల ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని తెలిసినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రతిపక్షాలు అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంపై ప్రతిపక్ష కుట్ర?
కాంగ్రెస్ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుతున్నామని, అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కుదరకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
ఫార్మాసిటీపై కోమటిరెడ్డి ఘాటు విమర్శలు
అసెంబ్లీలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ అంశంపై స్పందిస్తూ, బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం రైతుల భూములను బలవంతంగా లాక్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఒకేచోట 144 ఫార్మా కంపెనీలను స్థాపిస్తామని చెప్పిన బీఆర్ఎస్, ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అయితే అప్పటి ప్రతిపక్ష నేతలుగా తాము ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పోరాటం చేయలేదని కూడా ఆయన స్పష్టంగా తెలిపారు.
RBI: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్.. రూ. 75 లక్షల జరిమానా.. ఎందుకంటే?
తాజావార్తలు
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?