BRS Protest: నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపు నిచ్చింది.
ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్లో జోకర్గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.…
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా…
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే…
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్…
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవడమే కాకుండా, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి , విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేయబడింది. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే…
హఫీజ్పేటలో ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు పడిపోవడంతో మూడేళ్ల బాలుడి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదివారం రాత్రి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఆదివారం రాత్రి హఫీజ్పేటలో ఓ ఇంటి గోడ కూలి ఇటుకలు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపై పడ్డాయి. ఆస్బెస్టాస్ షీట్ పైకప్పు చిన్నారి సమద్పై పడడంతో వెంటనే మృతి…
దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు…
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గత ఏడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను నామినేట్ చేయగా, బిజెపి జి…