ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. 2014- 19 లో చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపెట్టవేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందన్నారు. టీడీపీ పాలనలో బీసీ సంక్షేమ…
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉచిత ఇసుక అమ్మకాలను రాష్ట్ర టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ప్రారంభించారు. రాజమండ్రి లాలాచెరువు స్టాక్ పాయింట్ వద్ద క్యూ కట్టారు ఇసుక వినియోగదారులు. టన్ను ఇసుక ధర 270 రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా కేవలం నిర్వహణ ఖర్చులు చట్టబద్ధమైన పనులు మాత్రమే వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండు లక్షల వరకు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష…
వైఎస్ఆర్ జిల్లా కడపలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే గా వైఎస్ జగన్ రాజీనామా, కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. కేవలం దుష్ప్రచారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సురేష్ బాబు.. 2011 లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో కడప దెబ్బ…
బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికులను వదిలిపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లుగా కొనసాగిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీని పునఃప్రారంభించాలని ఆయన కోరారు. ఈ వార్తా కాలమ్లలో ప్రచురితమైన వార్తా కథనం – “బతుకమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టిందా?” అని రామారావు స్పందిస్తూ, కష్టాల్లో ఉన్న పేద నేత కార్మికుల పట్ల…
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గద్దె శ్రీనివాసరావు కుమారుడు అయిన సూర్య అవినాష్ శశి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు.. అనంతరం ఉన్నత చదువులకై అమెరికా లోని న్యూ జెర్సీలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు… సోమవారం ఉదయం తన…
నేడు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీ జరగనుంది. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశంలో చర్చించనున్నారు. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై ఎస్ఎల్బీసీ తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం విద్యుత్శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఈ సమావేశంలో.. వ్యవసాయ రుణాలు,…
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాలలో మెరుపులతో కూడిన ఉరుములు, ఈదురు గాలులు (30-40 kmph) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని మొత్తం ఆరు జోన్లలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ప్రధానంగా వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై సమావేశం జరగనున్నట్లు సమాచారం. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపైనా ఎస్ఎల్బీసీ (SLBC)లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. అలాగే ఏపీ విద్యుత్పై ముఖ్యమంత్రి సాయంత్రం 3 గంటలకు శ్వేత పత్రం విడుదల చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో..…
గతంలో ఆంధ్ర.. తెలంగాణ ముఖ్యమంత్రులు ప్యాలెస్.. ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారని, కానీ చంద్రబాబు.. రేవంత్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సమావేశమయ్యారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి కాకాని వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు సోమిరెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని ఆ రంగానికి…
ఏపీ ఎన్నికల తరువాత తొలిసారి ఏపీ బీజేపీ విసృతస్థాయి సమవేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదని, సమావేశం కన్నుల పండువగా ఉందన్నారు. రెండు వేల మంది పాల్గొనడం ఆనందదాయకమని, దేశం లో 140కోట్ల జనభా తో ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు…