ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన ఈ సమావేశం జరగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, జాతీయ నేతలు శివప్రకాశ్ జీ, అరుణ్ సింగ్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. దేశం మొత్తం.. ఎమ్మెల్యేలు,…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్కు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవడం రాష్ట్ర…
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఒకే రోజు అటు టీడీపీ, ఇటు వైసీపీ కార్యక్రమాలు ఉండటంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పవిత్ర సంగమం వద్ద జల హారతి కార్యక్రమానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరవనున్న నేపద్యంలో స్వాగతం పలకడానికి రింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్భంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాళులర్పించేందుకు రింగ్ సెంటర్ లోని గాంధీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో జయంతి వేడుకలతో పాటు, పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ అవినాష్ రెడ్డి నివాళులు అర్పించి, ప్రత్యేక…
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుకను ఉచితంగా సరఫరా చేసేందుకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి తదితర జిల్లాల కలెక్టర్లు ఉచిత ఇసుక సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు, స్టాక్ పాయింట్లలో తగినంత ఇసుక ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గనులు, భూగర్భ శాస్త్రం, రవాణా, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది నదులు, కాలువల వెంట ఉన్న స్టాక్ పాయింట్లను సందర్శించి స్టాక్ పొజిషన్పై…
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నేడు రాజమండ్రిలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వా తొలి సారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన నేడు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. రాజమహేంద్రవరం లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన సమావేశం జరగనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు మురుగన్, భూపతిరాజు శ్రీనివాసవర్మ,…
హన్మకొండ జిల్లా దొడ్డి కొమురయ్య వర్ధంతి, రణధీర సీతక్క పుస్తక ఆవిష్కరణ పరిచయ వేదిక హన్మకొండ జెడ్పి కార్యాలయం లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేను చదువుకుంటున్న రోజులలో నక్సలైట్ అవుతాను అనుకోలేదన్నారు. సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి వచ్చానని, విప్లవ ఉద్యమం నుంచి ప్రజా సేవకొచ్చానన్నారు. పేదలను అసహ్యహించుకునే వాళ్లు రాజకీయలలో ఎక్కువ ఉంటారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. పేదరిక నిర్మూలన జరిగితేనే…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు జలవనరులు రైల్వేలైన్లపై చర్చ జరిగినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాద పూర్వక భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కు అక్కడ నుంచి పులిచింతల నాగార్జున సాగర్ కు గోదావరి జలాలు తరలింపు భవిష్యత్ లో కీలకమని,…
రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన…
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1225 పడకల (బెడ్స్) సామర్థ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మేఘు రెడ్డి,…