కొన్ని కొన్ని సార్లు ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కొందరు క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తరువాత బాధపడుతుంటారు. అలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. బస్సు కోసం వెయిట్ చేస్తోంది ఓ మహిళ. అయితే.. అదే సమయానికి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది కాని.. ఆమె ఉన్న చోట ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో కోపంతో అందుబాటులో ఉన్న బీర్ బాటిల్ను బస్సుపైకి రువ్వింది. ఆ మహిళ విసిరిన బీర్ బాటిల్ బస్సు వెనుక భాగంలోని…
వర్షాల నేపథ్యంలో చెట్లు, స్థంబాలు, విద్యుత్ వైర్స్ ఒరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే.. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ నగరం దేశానికి తలమానికమని, హైదరాబాద్ కు చాలా మల్టిలేవల్ కంపెనీలు వస్తున్నాయన్నారు. వాటికి కూడా విద్యుత్ అంతరాయం కలుగకుండా చూడాలని సూచించామని ఆయన తెలిపారు. ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో అధికారులతో మాట్లాడి ముందుకు వెళ్తామని, సుంకిశాల గోడ కూలిందని చూశానని, హైదరాబాద్ కి నీటి…
ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని, కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని ఆయన అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ…
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గురువారం నాడు వ్యతిరేకించారు. “వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే ఈ సవరణలు చేయడానికి ఈ సభకు అర్హత లేదు. ఈ బిల్లు ఆర్టికల్స్ 14, 15, మరియు 25 కింద ఉన్న సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రత మరియు అధికార విభజన సూత్రాలను ఉల్లంఘించినందున ఇది వివక్షత,…
ధరణి మాదిరిగా తప్పులు జరగకుండా కొత్త చట్టం చేయాలని ప్రభుత్వ ఆలోచన అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ.. 23 వ తేది వరకు అందరి సలహాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ధరణిలో జరిగినవి మాములు తప్పులు కాదని, అన్ని సంఘాలు…పార్టీల…
లోక్సభ సమావేశాలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. గత సభలో బడ్జెట్పై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేంద్రం (2024-25) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు గత లోక్సభ ఆమోదం తెలిపింది. దీనితో పాటు జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్కు, మరికొన్ని వినిమయ బిల్లులకు సభ మూజువాణి ఓటుతో సమ్మతిని వెల్లడించింది. అయితే.. లోక్ సభలో జీరో అవర్లో ఎంపీ బలరాం…
తెలంగాణ ప్రజలు బాగుండద్దు తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఏమైనా చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళ మంట లాగ కనిపిస్తుందని రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన భీమదేవరపల్లి మండలం ములకనురులో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వ్యక్తిగత పర్యటన కాదు.. అధికారిక పర్యటన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తో పాటు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ, పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికా వెళ్లి డెలిగేశన్స్ నీ కలుస్తున్నారన్నారు.…
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం లో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందన, రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడన్నారు. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా…
గత రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షాల వల్ల కొత్తగూడెం పట్టణంలోకి నీళ్లు వచ్చారు.మాతా శిశు ఆసుపత్రి చుట్టు వరద నీరుచేరడంతోఆసుపత్రిలో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఎగువన ఉన్న చెరువుల నీరు అంతా పొంగి ప్రవహించి పట్టణంలోకి రావడంతో ప్రజలు ఇక్కట్లకు గురి అయ్యారు.దీంతోపట్టణంలోకి వాహనాలు రాకుండా నిలిపివేశారు. విద్యా నగర్ సమీపంలోని కొన్ని కాలనీలకు వరద నీరుచేరింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోకి చింత చెరువు ద్వారా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రధానరహదారి…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల చేనేతను గుర్తించి ప్రయోజనకరమైన పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కోరారు. చేనేత కార్మికులకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించాలని, చేనేత పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం చేనేత రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని, దేశ చరిత్రలో…