ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా? ఢిల్లీకి మేం రాకూడదా? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని, కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని ఆయన అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని, ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసు అన్నారు. 2 ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైంది. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు మా పార్టీ కూడా అంతే. కొందరు డబ్బుకు ఆశపడి వెళ్లారు. అంతమాత్రాన పార్టీ పని అయిపోయినట్టు కాదని, ప్రజలు కూడా రైతు బంధు సహా అనేక పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితే నమ్మారు. ఓటు వేశారన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదు. కొన్నేళ్ళ తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని, బీఆర్ఎస్ బలహీనపడలేదు. మేం బలంగానే ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదని, నిన్నగాక మొన్న మహబూబ్నగర్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ గెలుచుకున్నామన్నారు శ్రీనివాస్ గౌడ్.
Waqf Bill: “1500 ఏళ్ల దేవాలయం వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుంది..? ” ఉదాహరణలతో విరుచుకుపడిన బీజేపీ..
అంతేకాకుండా..’ఒక జాతీయ పార్టీ ఎదగాలని కోరుకోవడం తప్పేం కాదు కదా?. కానీ ప్రజలు ఆ జాతీయ పార్టీ పక్క రాష్ట్రంలో ఏం చేసిందో చూస్తారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీయా.. రాహుల్ గాంధీయా అన్నదే చూశారు. అందుకే ప్రాంతీయ పార్టీలకు అవకాశం దక్కలేదు. మేము అటో ఇటో ఉంటే మాగ్కూడా 10-15 సీట్లు వచ్చి ఉండేవి. మేం ఈ రెండు కూటముల్లో లేకపోవడం వల్లనే ఫలితాలు ఇలా వచ్చాయి. ఎన్నికలప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఉండదు. ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదు. అది పూర్తిగా దుష్ప్రచారం. ప్రజాగ్రహం ఎదురైతే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో చూశాం. ఎక్కడైనా అలాగే జరుగుతుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరిగాయి. పార్టీ పని అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరి పాత బుద్ధి మారలేదు. ఇప్పుడు బీజేపీలో విలీనం అంటూ అత్యుత్సాహంతో కథనాలు రాస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.
Serial Killer: చెరుకు తోటల్లో చీరతో ఉరేసి..యూపీలో సీరియర్ కిల్లర్..? 9 మంది మహిళల హత్య..
భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది. ప్రజలపక్షాన కొట్లాడతది. తెలంగాణ రాక ముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడ్డ తర్వాత పరిస్థితిని పోల్చి చూడండి. వ్యవసాయం, విద్యుత్తు, ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోండి. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా భయపడేవారు. సచివాలయంలో భాష యాస మార్చుకుని మాట్లాడిన సందర్భాలున్నాయి. తెలంగాణ పేరు చెబితే గతంలో ఢిల్లీ ఏపీ భవన్లో గదులు కూడా ఇవ్వకపోయేవారు.’ అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.