నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ కు నిన్నటి ఆదరణ చూస్తుంటే నిజంగానే నల్లగొండ జిల్లాలో ఓడిపోయామా అనిపించిందన్నారు. చేసింది చెప్పుకొకపోవడం, ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికలో జరగొద్దన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చినా… మనం నిరుద్యోగ యువత మనసు గెలుచుకొలేకపోయమని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓటు…
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతుల పేరిట ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని, ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో కొంత పంట నష్టం జరిగితే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బిఆర్ఎస్ రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్న పది సంవత్సరాలపాటు రైతుల ను పట్టించుకోని కేసీఆర్ ఎంపీ సీట్ల కోసం దొంగ కన్నీరు కారుస్తున్నారని…
ప్రతిపక్షం అంటే ఖాళీగా కూర్చోవడం కాదని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి చేశారో మీ విజ్ఞత కే వదిలేస్తామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కాలు బయట పెట్టగానే ఎందుకు అంత ఉలిక్కిపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత brs ఉండదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి ముందు చూసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. 50 సీట్లు కూడా దాటవని సర్వేలు చెబుతున్నాయని,…
బీజేపీ కిసాన్ మోర్చా సమావేశం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరకడం లేదన్నారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని, మోడీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నుండి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాయిల్డ్ రైస్ కొనాలని మోడీని కోరితే ఓకే చెప్పారన్నారు కిషన్ రెడ్డి.…
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు త్వరలో అర్థం అవుతుందన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టమంటారో చెప్పాలన్నారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ను వీడుతున్న వాళ్ళంతా స్వార్థ…
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉందని, రాష్ట్రంలో ఏనాడైనా పంటల బీమా డబ్బులు కానీ, కరువు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంగా ఏనాడైనా కేసీఆర్ రైతుల వద్దకు పోయారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంపొయాక ఇప్పుడు…
ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనీ ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి గల ప్రతిపక్ష నాయకులారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత. అప్పటికే నాగార్జునసాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే నీళ్ళివనీ మీరు, రెండో పంటకి నీళ్ళివాలని హేతుబద్దత లేని డిమాండులు చేయడం మీ దుర్భుద్దికి…
రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోమారు జంగ్ సైరన్ మోగించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యంవల్ల సాగు నీరందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం… పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు అమలు చేయని నేపథ్యంలో ‘రైతు దీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా…
కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసే పార్టీ అని, కాంగ్రెస్ నాయకులని మాదిగ పల్లెలోనికి రానివ్వదు అని నేను మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఇవాళ ఆయన హనుమకొండ జిల్లా హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ నుండి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయారన్నారు. వరంగల్ లో ఎక్కువ…
మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్, 6 ఏప్రిల్ 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. బహుళ భాషల్లో సినిమాలను నిర్మిస్తున్న ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈరోజు, మేకర్స్ తెలుగు ట్రైలర్ను ఆవిష్కరించారు. స్నేహితుల బృందం కొడైకెనాల్కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా.…