KTR : కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ కు నిన్నటి ఆదరణ చూస్తుంటే నిజంగానే నల్లగొండ జిల్లాలో ఓడిపోయామా అనిపించిందన్నారు. చేసింది చెప్పుకొకపోవడం, ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని, అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికలో జరగొద్దన్నారు. నోటిఫికేషన్ లు ఇచ్చినా… మనం నిరుద్యోగ యువత మనసు గెలుచుకొలేకపోయమని, అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం ఉద్యోగులు బీఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓటు వేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన లేదని, రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ఉండాలి, ఇచ్చిన ప్రతిహమి అమలు చేయాలన్నారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో ముప్పుందని, సీఎం పదవి కోసం బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడన్నారు కేటీఆర్.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
పార్లమెంట్ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి శరణు, షెల్టర్ కోసం కాంగ్రెస్ నుండి బీజేపీతో కలుస్తారన్నారు. అనంతరం నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో గన్నెబోయిన మల్లయ్య ను పరామర్శించారు కేటీఆర్. వంట నష్టపోయి, అప్పులపాలయ్యనని ఆవేదన వ్యక్తం చేసిన గన్నెబోయిన మల్లయ్య వీడియో కొద్ది రోజుల క్రితం వైరల్ అయ్యింది.. ఆ వీడియోకు స్పందించిన కేటీఆర్.. మల్లయ్య ఇంటికి వెళ్ళి, ఆయన్ను పరామర్శించి భరోసా ఇస్తానని ఎక్స్ X లో హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ముషంపల్లికి చేరుకున్న కేటీఆర్. గన్నేబోయిన మల్లయ్య కు లక్ష రూపాయల చెక్ అందజేశారు. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని తెలంగాణ ప్రజలు చెప్తున్నారని, కేసిఆర్ పర్యటనతో కదిలిన ప్రభుత్వం.. కాళేశ్వరం నుండి ప్రస్తుతం సాగు నీరు విడుదల చేస్తుందన్నారు కేటీఆర్. మూడు పిల్లర్లలో సమస్య వస్తే.. పరిష్కరించేందుకు 3 నెలలు సరిపోలేదా ప్రభుత్వానికి.. ఎకరానికి 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!