ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి పెరుగుతున్నందున, తెలంగాణకు ఇది అత్యంత కఠినమైన వేసవి సీజన్లలో ఒకటిగా మారుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురిసే ముందు, మే మొదటి వారం వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు మించి నమోదయ్యాయి. అయితే.. ఇవాళ ఎండలకు హైదరాబాద్ మండిపోయింది. ఈ సమ్మర్లోనే హైదరాబాద్లో ఇవాళ హాటెస్ట్ డే రికార్డ్ అయ్యింది.…
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్ లో కూడా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండగా బిఆర్ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తప్పుపట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు…
‘హలో…మీ అబ్బాయి రేప్ కేసులో చిక్కుకున్నాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాం. మీరు అతన్ని విడిపించాలనుకుంటే వెంటనే ఈ నంబర్కు కాల్ చేయండి. మీకు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలర్ చెప్పినట్లుగా వింటే మాత్రం.. మీ బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. అంతేకాకుండా.. సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అవును, దేశంలో ఇలాంటి మోసం ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు…
నేను రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి ఉంటే నాకు కాంగ్రెస్ బి పామ్ ఇస్తుందా….? అని యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్ ఎంపీ గా ఉన్న సమయంలో తెచ్చిన నిధుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎందుకు కనిపించడం లేదని ఆయన అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూర…
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ హామీలు అని ఆయన విమర్శించారు. సర్పంచ్లకు నేరుగా నిధులు ఆల్రెడీ వస్తున్నాయని, పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ యోజన.. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు కిషన్ రెడ్డి. సంగీత నాటక అకాడమీ కి ఫౌండేషన్ , ఘంటశాల కళమండపం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.. శంఖుస్థాపన…
వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్యుడ్ని దైవంతో పోలుస్తూ వైద్యో నారాయణో హరి అని మన పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టే వైద్యులు నిజంగానే మరో దేవుడితో సమానం అన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయక రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయo అభినందనీయం అన్నారు. కూకట్పల్లి డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి…
సన్నాహాక సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో గులాబీ జెండా ను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా అని ఆయన అన్నారు. మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని ఆయన విమర్శించారు. తొక్కల మినిస్టర్ నాలుగు సార్లు చేసి డిగ్రీ కళాశాల తేలేదని, ఘనపూర్ కు ఎక్కువ నష్టం చేసిన కడియం ను రాజకీయ సమాధి చేయాలన్నారు పల్లా. మున్సిపాలిటీ,టెక్స్టైల్ పార్కు, సైనిక్ స్కూల్ రాకుండా అడ్డుపడ్డాడని,…
కేంద్ర ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు అన్ని సబ్సిడీలను రద్దు చేసినందున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) తమ పెట్రోల్ బంక్లను రిటైల్ అవుట్లెట్లుగా మార్చాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో నాబార్డు సహకారంతో ఒక్కో బంక్పై దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షలు వెచ్చించి పాత, మూతపడిన ఇంధన కేంద్రాలను ఆధునీకరించాలని పీఏసీఎస్ అధికారులు నిర్ణయించారు . రిటైల్ అవుట్లెట్లు కొన్ని స్పెసిఫికేషన్లను అనుసరించడం తప్పనిసరి. ఇంధన స్టేషన్లు తప్పనిసరిగా రోడ్డు పక్కన గోడలు మరియు టైల్…
సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్…
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు…