తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్లు ఓర్చుకోలేక పోతున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు దానిని అడ్డుకున్నాయన్నారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో వేసామన్నారు..రైతు భరోసా ను ఆపాలని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశాయనీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల వరకు రైతు భరోసా…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులతో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు దీంతో కొంత ఉపశమనం లభించింది. జిల్లావ్యాప్తంగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల ధాన్యం తడిసిముద్దయింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల…
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు విజయాన్ని కాంక్షిస్తూ బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తా నగర్ లోని సాయిబాబా ఆలయంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద రావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు, మాజీమంత్రి కాకతీయ వంశస్థులు కమల్ మంజు దియా కాకతీయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా డప్పు వాయించారు వినోద్ రావు, పొంగులేటి…
ఉప్పల్ కార్నర్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ను బీజేపీకి తాకట్టు పెట్టిందని, బీఆర్ఎస్ ఒక దిష్టిబొమ్మను ముందు పెట్టింది తప్ప .. ఎన్నికల్లో పోటీ చేయడంలేదని, అయ్యా.. ఈటల రాజేందర్..2001 నుంచి 2021 వరకు ఇరవైఏళ్లు కేసీఆర్ తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా అని ఆయన అన్నారు. మీకు పంపకాల్లో పంచాయితీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదని, 2021లో…
భారత ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం తర్వాత వరుసగా నాలుగో రోజుకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బస్సుయాత్ర చివరి దశకు చేరుకోనుంది. ప్రచారానికి చివరి వారంలో మరిన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. సోమవారం వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో వాహనాల కాన్వాయ్తో చంద్రశేఖర్రావు ప్రజలతో మమేకమై వారి సమస్యలు, బాధలను వింటూ వారి సమస్యలను విన్నవించారు. కొప్పుల ఈశ్వర్ తన అభ్యర్థిత్వానికి ఎన్నికల మద్దతును…
వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా నగరంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)తో సహా మొత్తం 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం (EC) మార్గదర్శకాల ప్రకారం, CAPF సిబ్బందిని నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు. ” EC హైదరాబాద్కు 22…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతు బంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రూ.2వేల కోట్లకు పైగా…
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తనకు మద్దతు ఇవ్వాలని బొగ్గుగని కార్మికులు కోరారు. సోమవారం బెల్లంపల్లిలోని భూగర్భగని శాంతిఖనిలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ మాట్లాడుతూ తాను 25 ఏళ్లుగా ఎస్సిసిఎల్లో బొగ్గు గని కార్మికుడిగా పనిచేశానని, వారి సవాళ్లను తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మైనర్ల హక్కుల కోసం తాను పోరాటం చేశానని, గని కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర…
అమిత్ షా టాక్స్, అంబానీ టాక్స్ విన్నామని, ఆర్, ఆర్ టాక్స్ వినలేదన్నారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ హక్కు తో ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లోకి వచ్చారని, ఢిల్లీ పోలీసులకు మాతెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు రేణుకా చౌదరి. మర్యాదగా కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళని విడిచిపెట్టండని, ప్రజ్వల్ రెవన్న ను ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ లో మహిళల పై దుర్భాషలాడిన…
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం…