తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్లు ఓర్చుకోలేక పోతున్నాయనీ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందరికీ రైతు భరోసా విడుదల చేయాలని తమ ప్రభుత్వం భావిస్తుంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు దానిని అడ్డుకున్నాయన్నారు. నిన్న ఒక్కరోజే 900 కోట్లు రైతుల ఖాతాలో వేసామన్నారు..రైతు భరోసా ను ఆపాలని ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేశాయనీ పేర్కొన్నారు. దీంతో ఎన్నికల వరకు రైతు భరోసా ఆపాలని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఇది రైతుల పట్ల బీజేపీ , బిఆర్ఎస్ లకు ఉన్న కపట ప్రేమ అని రైతులు ,ప్రజలంతా బీజేపీ , బీఆర్ఎస్ లని నిలదీయాలని, ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.. ప్రతిపక్షాల ఫిర్యాదుతో లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది రైతుల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ కు ఉన్న కపట ప్రేమ అని మండిపడ్డారు. ఈ విషయాన్ని రైతులంతా గమనించాలని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లను నిలదీసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాగా రైతు బంధు చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్.వేణు కుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఈసీ నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది.