మే 27న జరగనున్న శాసనమండలికి నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు సంబంధించి బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. గత ఏడాది డిసెంబర్లో జనగాం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్కు చెందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్…
మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని,…
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి…. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్ కి చెందిన మేకలను ఈరోజు కుక్క లు ఉదయం దాడి చేసి చంపేసాయి….గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను,కోళ్లను కూడా ఇదేవిధంగా దాడి చేసి చంపేసాయి… అయితే దీనిపై యువకుడు గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని…
బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు రానున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మా పై తప్పుడు ప్రచారం చేశారని, మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున…
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల గడువులోపలే 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటిలను అమలు చేయడం జరిగింది, మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ సిటీ అభివృద్ధి, పాల్ టెక్నిక్ కళాశాల, ఐటీఐ…
హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల…
మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘స్పెక్ట్రమ్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి బుధవారం ప్రారంభించారు. మే 20 వరకు జరిగే ఈ ప్రదర్శనలో డ్రాయింగ్లు, ఆయిల్ పెయింటింగ్లు, ఎచింగ్లు, సిరామిక్ శిల్పాలు మరియు ఫైబర్ శిల్పాలతో సహా విభిన్న కళాత్మక వ్యక్తీకరణలు ఉన్నాయి. ఈ విభిన్న కళాకృతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాకు చెందిన ఏడుగురు నైపుణ్యం కలిగిన కళాకారులు PY రాజు, గోపాల్, క్రాంతి చారి, ప్రియదర్శన్, రాజేష్ చోడంకర్, శ్రీ హర్ష,…
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది.…
అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు…
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి పై.. కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలువ బోతుందన్నారు. లక్షా 30 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి…