Peddi Sudarshan Reddy : కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్లలో స్పష్టంగా కనిపిస్తోంది
పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ టెండర్ల పేరిట అక్రమాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ చేతి వాటం ఈ టెండర్ల లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరుకు పోయిన ధాన్యాన్ని వేలం వేయడానికి పిలిచిన టెండర్లలో జరిగిన అక్రమాల్లో సీఎం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇందులో వాటాలు వెళ్లాయని, మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సేకరణ కు పిలిచిన తాజా టెండర్లలోనూ చేతి వాటం ప్రదర్శించారని ఆయన మండిపడ్డారు.
Also Read
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
- Toxic: అఫీషియల్.. ‘టాక్సిక్’ రిలీజ్ వయిదా..
సన్న బియ్యం కిలో రేటు ను బహిరంగ మార్కెట్ కన్నా అధికంగా నిర్ణయించారని, దాదాపు 330 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయేవిధంగా టెండర్లు ఉన్నాయన్నారు. దాదాపు 57 రూపాయలకు కిలో చొప్పున సన్న బియ్యం కొనేలా టెండర్లు ఇచ్చారని, రైస్ మిల్లర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సంబంధించిన నాలుగు సంస్థలకు లబ్ది చేకూరేలా కాంగ్రెస్ పెద్దలు టెండర్ల ను రింగ్ చేశారని, రేవంత్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పౌరసరఫరాల శాఖలోనే వెయ్యి కోట్ల రూపాయల కుంభ కోణం జరిగిందన్నారు. టెండర్ల అక్రమాల పై సోమవారం బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన సీ ఎస్ కు పిర్యాదు చేయబోతున్నామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
-
MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
-
Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో