Kishan Reddy : తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్లో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని మోడీ నిలిపారన్నారు. 400 సీట్లు NDA కు వచ్చే వాతావరణం ఉందని, మంచి మెజార్టీతో ఎంపీగా ఆరూరి రమేష్ గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అని కిషన్ రెడ్డి అన్నారు. హమీలు నెరవేర్చలేని ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని, బ్యాంకుల నుండి అప్పులు తీసుకోని రుణ మాఫీకీ కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణను కాంగ్రెస్-బీఆర్ఎస్ దగా చేస్తున్నాయని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే పరిస్థితులు ఉన్నాయని ఆయ పేర్కొన్నారు. భవిష్యత్తు లో తెలంగాణ ను రక్షించుకునే భాద్యత బీజేపీ తీసుకుంటుందని, బీజేపీ MLC అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా..’బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి క్యూ కడుతున్నారు. తెలంగాణ భవన్ బాగాలేదని ఎమ్మెల్యేలను గాంధీభవన్ కు పంపించి ఏ మొఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ రెండు ఒక్కటే…రెండు పార్టీల DNA ఒక్కటే. బీఆర్ఎస్- కాంగ్రెస్ ప్రజల కోసం రాజకీయాల్లోకి రాలేదు..స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. నా మీద పోటీ చేసిన దానం నాగేందర్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. కానీ ఇప్పుడు పోటీ చేసింది కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా.. చేతి గుర్తుపై పోటీ చేశారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలి. పార్టీ ఫిరాయింపులపై,ఆర్థిక పరిస్థితి పై మేదావులు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ సమాజం బీజేపీ కీ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయదు’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
- Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
- CM Chandrababu: 'మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు'.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
- Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
తాజావార్తలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
-
Vaibhav: ఒక్కో రన్కు రూ.14 వేల సంపాదన.. భారీగా పెరిగిన వైభవ్ బ్రాండ్ వ్యాల్యూ.. ఇక్కడే బిగ్ ట్విస్ట్!
-
Hardik Pandya-Fan: ఒడిశా టు బెంగళూరు.. హార్దిక్ కోసం 1800 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని!
-
CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..