ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న…
Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. బీజేపీ అతడిని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించిందనే సోషల్ మీడియా స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి.
గత ప్రభుత్వం కూడా ఇదే అహంకారంతో ఎన్నికలకు పోయి బొక్క బోర్లా పడింది.. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అదే పరిస్థితి వస్తుందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం అడ్డగోలు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు.. పూటకో మాట మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి చదువుకున్న విజ్ఞులు ఓటు వేయకుండా గుణపాఠం చెప్పాలన్నారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.
Aravind Kejriwal: స్వాతి మలివాల్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ పోలీసులు అతని తల్లిదండ్రులను విచారించాలనుకుంటున్నారని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఒక సంచలనమైన తీర్పును కలకత్తా హైకోర్టు ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని అక్కడి న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చింది.
తెలంగాణను గత 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణను అన్ని విధాలుగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.. బీజేపీ మీ అందరూ భద్రత కోసం పని చేస్తుంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో కలపలేదు కేసీఆర్ అందుకే చాలా ప్రాణాలు పోయాయి.
రెండ్రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం.. కేంద్రప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు.
Swati Maliwal assault Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆప్ పార్టీ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఆప్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది.